spot_img
Homeజాతీయ వార్తలుBandi Sanjay- KCR: కెసిఆర్ కు షాక్ ల మీద షాకులు: బండి 2.0 మామూలుగా...

Bandi Sanjay- KCR: కెసిఆర్ కు షాక్ ల మీద షాకులు: బండి 2.0 మామూలుగా లేదు

Bandi Sanjay- KCR
Bandi Sanjay- KCR

Bandi Sanjay- KCR: టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో అరెస్టు చేసిన తర్వాత, జైలుకు పంపించిన తర్వాత, హెబియస్ కార్పస్ ద్వారా బయటకు విడుదలైన అనంతరం బండి సంజయ్ చాలా మారిపోయారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన స్టైల్ లో షాక్ లు ఇస్తున్నారు. వాస్తవానికి బండి సంజయ్ ని అకారణంగానే జైలుకు పంపించారని తెలంగాణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చిన మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తారని, ఆ మాత్రం దానికి బండి సంజయ్ ని అరెస్టు చేయడం ఏమిటనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బండి సంజయ్ పూర్తిగా కెసిఆర్ స్టైల్ లో ఆయనకు తిరుగు సమాధానం చెబుతున్నారు. మొన్నటిదాకా బండి సంజయ్ స్మార్ట్ ఫోన్ మీద నానా యాగి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు బండి సంజయ్ దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. ఆరోజు పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో నా ఫోన్ పోయిందని, అదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పానని బండి సంజయ్ చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఈ మెయిల్ ద్వారా కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకులు బండి సంజయ్ స్మార్ట్ఫోన్ మీద మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పైగా భద్రతా కారణాల దృష్ట్యా తన సోదరి పేరు మీద తీసుకున్న సీఎం ద్వారా తాను మాట్లాడుతున్నానని, ఆ ఫోన్ కు చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకులు తనతో మాట్లాడారని.. ఆ విషయం తెలిసే కెసిఆర్ తనను ఆకారణంగా అరెస్టు చేయించారని బండి సంజయ్ చెబుతున్నారు.

Bandi Sanjay- KCR
Bandi Sanjay- KCR

ఇక ప్రధానమంత్రి సికింద్రాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఒక కుర్చీ వేయించాలనే ఆలోచన కూడా బండి సంజయ్ దే అని భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్తున్నారు. అలా కుర్చీ వేయించడం ద్వారా కెసిఆర్ కు తాము గౌరవం ఇస్తున్నట్టు బండి సంజయ్ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అంతకుముందే ప్రధానమంత్రి నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే.. ఆయనకు గజమాలతో సన్మానం చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. అంతేకాదు ఆయనకు శాలువాతో కూడా సన్మానం చేయిస్తానని వివరించారు.. కానీ ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదు. మరోవైపు సమావేశం ముగిసిన తర్వాత బండి సంజయ్ కెసిఆర్ కు తాను కాపాలనుకున్న శాలువాను కూడా చూపించారు. ఇది ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా నేత కార్మికులతో నేయించామని, ఆయన సభకు వస్తే కచ్చితంగా కప్పి సన్మానించేవారిమని సంజయ్ ప్రకటించారు.

ఇలా ప్రకటించడం ద్వారా భారత రాష్ట్ర సమితి నాయకులంటే తమకు గౌరవం అని, అందుకే తాము గౌరవంగా సభకు పిలిచామనే సంకేతాలను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. అదేవిధంగా తమకు రాజకీయాలు తప్ప వ్యక్తిగత వైషమ్యాలు లేవని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో భారత రాష్ట్ర సమితికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ను సింగరేణి ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటామని ప్రకటించిన నేపథ్యంలో.. దీనికి బిజెపి నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper