spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Alcohol Sales: ఏపీ సంక్రాంతిదే.. ఈ పండుగకు ఎంత తాగారో తెలుసా?

AP Alcohol Sales: ఏపీ సంక్రాంతిదే.. ఈ పండుగకు ఎంత తాగారో తెలుసా?

AP Alcohol Sales: ఆంధ్రప్రదేశ్ లో పండుగ పూట మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వానికి ఆదాయం ఘనంగా సమకూరింది. దీంతో సంక్రాంతి పండుగ కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. మద్యం ద్వారా ఆదాయం బాగానే రావడం ప్రభుత్వానికి ఆసరాగా కలిసొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు మద్య నిషేధం చేస్తానని మాటిచ్చారు. కానీ అదే ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో ఇప్పుడు మాట తప్పారు. అంచెలంచెలుగా మద్యం విక్రయాలు విస్తరిస్తున్నారు. ప్రభుత్వానికి ఏటేటా ఆదాయం బ్రహ్మాండంగా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యనిషేధం గురించి మరిచిపోయారు. ప్రభుత్వానికి మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ఉందంటే దాంతో ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తూనే ఉంది.

AP Alcohol Sales
AP Alcohol Sales

సంక్రాంతి పండగ వేళ ఏపీవాసులు విచ్చలవిడిగా మద్యం తాగేశారు. రాష్ట్రంలో మొత్తం 2.33 కేసుల మద్యం, 83 వేల కేసుల బీర్లు తాగారు. దీంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వచ్చింది. పండుగ కావడంతో ఎంజాయ్ చేసేందుకే అందరు మొగ్గు చూపారు. మూడు రోజుల్లో రాష్ర్టవ్యాప్తంగా రూ.213 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా అత్యధికంగా మద్యం అమ్మకాలు చేసింది. ఇక్కడ దాదాపు రూ.21 కోట్ల మద్యం అమ్ముడైనట్లు అధికారులు గుర్తించారు. తర్వాత స్థానాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలున్నాయి.

సంక్రాంతికి అందరు ఎంజాయ్ మెంట్ కే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే మద్యం అమ్మకాలు ఇంతలా పెరిగాయి. పండగ జోష్ లో మద్యం తాగి కిక్కు లో గడిపారు. దీంతో ప్రభుత్వానికి కూడా మంచి కిక్కు దొరికింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాల శిబిరాల్లోకి భారీగా మద్యం బాటిళ్లు సరఫరా అయినట్లు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరు పండగకు సొంతూళ్లకు రావడంతో ఊళ్లన్ని కళకళలాడాయి. కోడిపందాల ఎంజాయ్ లో మద్యం భారీగా తాగారు. దీంతో మంచి ఆదాయం సమకూరింది ప్రభుత్వానికి.

AP Alcohol Sales
AP Alcohol Sales

డిసెంబర్ 31న రూ.127 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే సంక్రాంతికి అంతకు రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరగడం విశేషం. మద్యం మంచినీళ్లలా తాగారు. తెలంగాణలోనూ మద్యం అమ్మకాలు భారీగానే ఉన్నాయి. రూ.217 కోట్ల మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగ రెండు రాష్ట్రాలకు మంచి కిక్కు మాత్రం ఇచ్చింది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడంతో ప్రభుత్వాలకు మంచి ఆదాయం సమకూరింది. హోటళ్లు, బార్లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడంతోనే ఇంత ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version