Homeఉద్యోగాలుTCS layoffs 2025 : మొన్న 'ఎయిర్ ఇండియా'.. ఇప్పుడు TCS.. అసలు TATA కంపెనీలకి...

TCS layoffs 2025 : మొన్న ‘ఎయిర్ ఇండియా’.. ఇప్పుడు TCS.. అసలు TATA కంపెనీలకి ఏమవుతుంది?

TCS layoffs 2025 : రప్పా.. రప్పా.. ఇటీవల చాలా ఫేమస్‌ అయిన డైలాగ్‌ ఇది. పుష్ప2 సినిమాలోని ఈ డైలాగ్‌ ఇటీవల రాజకీయాల్లో వాడుతున్నారు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ ఐటీ కంపెనీలను కూడా తాకింది. భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) సంస్థ అచ్చం ఈ డైలాగ్‌ తరహాలోనే ఉద్యోగులను ఊచకోత కోస్తోంది. 2025లో 12,261 ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది, ఇది దాని మొత్తం 6,13,069 మంది ఉద్యోగులలో 2%ని సూచిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, నైపుణ్య అసమానతలు ఈ లేఆఫ్‌లకు ప్రధాన కారణాలుగా సంస్థ చెబుతోంది. ఈ నిర్ణయం మిడిల్‌, సీనియర్ స్థాయి మేనేజర్‌లపై ఎక్కువ ప్రభావం చూపనుంది, ఇది ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.

లేఆఫ్‌లకు కారణాలు ఇవీ..
టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ ప్రకారం, 12,261 ఉద్యోగుల తొలగింపు నిర్ణయం అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, ఏఐ ఆధారిత ఆపరేటింగ్ మోడల్‌లు, నైపుణ్య అసమానతల కారణంగా తీసుకోబడింది. కంపెనీ గతంలో ఉద్యోగుల శిక్షణ, రీస్కిల్లింగ్‌పై గణనీయమైన పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ చర్య అనివార్యమైందని పేర్కొన్నారు. ఈ లేఆఫ్‌లు ప్రధానంగా మిడిల్‌, సీనియర్ స్థాయి మేనేజర్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. వీరికి ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించబడింది. ఈ నిర్ణయం టీసీఎస్ యొక్క భవిష్యత్-సిద్ధమైన వ్యూహంలో భాగంగా, ఏఐ, కొత్త టెక్నాలజీలలో పెట్టుబడులను పెంచడానికి తీసుకున్న చర్యగా టీసీఎస్‌ పేర్కొంటోంది.

బెంచ్ పాలసీ కూడా..
టీసీఎస్ కఠినమైన బెంచ్ పాలసీ ఈ లేఆఫ్‌లలో కీలక పాత్ర పోషించింది. కంపెనీ నిబంధనల ప్రకారం, ఉద్యోగులు ఏడాదిలో కనీసం 225 రోజులు ప్రాజెక్టులలో చురుకుగా పనిచేయాలి, బెంచ్‌పై (ప్రాజెక్టు లేని స్థితిలో) గరిష్టంగా 35 రోజులు మాత్రమే ఉండాలి. ఈ పాలసీని అమలు చేయడంలో విఫలమైన ఉద్యోగులను లేఆఫ్‌ పేరుతో తొలగిస్తోంది. ఈ విధానం ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. కొంతమంది ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఈ ఒత్తిడి, అనిశ్చితి ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

72 శాతం తగ్గిని రిక్రూట్‌మెంట్‌..
ఐటీ రంగంలో కొత్త నియామకాలు 2025లో 72% తగ్గాయి. ఇది ఉద్యోగ ఆకాంక్షులకు, ప్రస్తుత ఉద్యోగులకు సవాల్‌గా మారింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అగ్ర కంపెనీలు కొత్త రిక్రూట్‌మెంట్‌ను దాదాపు నిలిపివేసి, ఉన్న ఉద్యోగులను తగ్గించడంపై దృష్టి సారించాయి. ఈ పరిస్థితి ఐటీ నిపుణులలో ఆందోళనను పెంచుతోంది, ఎందుకంటే కొత్త అవకాశాలు లేకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. ఈ తగ్గుదల కారణంగా, ఐటీ రంగం ఒకప్పుడు రంగుల ప్రపంచంగా భావించబడిన ఆకర్షణను కోల్పోతోంది.

ఏఐ, అంతర్జాతీయ అనిశ్చితుల ఎఫెక్ట్‌..
ఏఐ ఆధారిత ఆటోమేషన్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు టీసీఎస్ లేఆఫ్‌లకు ప్రధాన కారణంగా సీఈవో వెల్లడించారు. ఏఐ ఆపరేటింగ్ మోడల్స్ సంప్రదాయ ఐటీ రోల్స్‌ను తగ్గిస్తున్నాయి. క్లయింట్ డిమాండ్‌లో సంకోచం కంపెనీలను ఖర్చు తగ్గింపు చర్యలకు ఒత్తిడి చేస్తోంది. టీసీఎస్ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీలో పెట్టుబడులను పెంచుతోంది, కానీ ఆశించిన ఫలితాలు రావడం లేదని సీఈవో వెల్లడించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular