HomeతెలంగాణCM Revanth Reddy : నాగార్జున లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.. ఎవరిని వదిలిపెట్టం...

CM Revanth Reddy : నాగార్జున లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.. ఎవరిని వదిలిపెట్టం – సీఎం రేవంత్ రెడ్డి

నేడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ' చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తి లేదు. నా సొంత మిత్రుల ఫామ్ హౌస్ లను కూడా వదిలి పెట్టను. నాగార్జున గారే కాదు, ఇలా చాలా మంది ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను గుర్తించాము. వాటి నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం.ఇందులో ఎలాంటి కక్ష్య పూరిత రాజకీయాలు లేవు.

CM Revanth Reddy :  తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టిన ఈ నేపథ్యంలో, నిన్న హైదరాబాద్ లోని మాధాపూర్ లో ఉండే N కన్వెన్షన్ హాల్ ని హైడ్రా అధికారులు కూల్చేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఇది ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కి చెందిన ఆస్తి. దీనిపై రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రశ్నించాడు. అక్రమ నిర్మాణం అని తెలిసినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆ కట్టడాన్ని కూల్చలేదు?, నాగార్జున కి మీకు ఎలాంటి లావాదేవీలు జరిగాయి అని నిలదీసాడు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ N కన్వెన్షన్ మాల్ ని కూల్చేశాడు. దీనిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తి లేదు. నా సొంత మిత్రుల ఫామ్ హౌస్ లను కూడా వదిలి పెట్టను. నాగార్జున గారే కాదు, ఇలా చాలా మంది ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను గుర్తించాము. వాటి నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం.ఇందులో ఎలాంటి కక్ష్య పూరిత రాజకీయాలు లేవు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను సీఎం గా విఫలమైనట్టే’ అంటూ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

అయితే అక్కినేని నాగార్జున నిన్న ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కట్టివేత కూల్చడం పై హై కోర్టు స్టే విధించిందని, నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం మాత్రం స్టే ఇచ్చారు అనేది పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పేసారు. దీనికి నాగార్జున నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో, జనాలు నాగార్జున వైపు  నుండే తప్పు ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరి ఆయన ప్రెస్ మీట్ ద్వారా హై కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ని మీడియా ముందు పెడుతాడా?, లేకపోతే ఈ ఘటన ని ఇక్కడితో వదిలేసి తన పని తాను చూసుకుంటాడా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా  నాగార్జున సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నాడు. మంగళవారం నుండి ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి.

నిన్న, మొన్న మొత్తం కంటెస్టెంట్స్ కి సంబంధించిన స్పెషల్ ఏవీ వీడియోస్ ని షూట్ చేసారు. శుక్రవారం రోజు బిగ్ బాస్ లాంచ్ కి సంబంధించిన చిన్న ప్రోమో వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు. ఇలా మూడు నెలల పాటు నాగార్జున బిగ్ బాస్ షోతో బిజీ కానున్నాడు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుభేర’ అనే చిత్రం చేస్తున్నాడు. లవ్ స్టోరీ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ గా ఏర్పడ్డాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper