HomeతెలంగాణYadagirigutta: భట్టి కింద .‌ రేవంత్ ‘రెడ్డి’లు పైన.. పెను దుమారం

Yadagirigutta: భట్టి కింద .‌ రేవంత్ ‘రెడ్డి’లు పైన.. పెను దుమారం

Yadagirigutta: ఉదయం నుంచి ఒకటే దుమారం.. మీడియాలో ఒకటే చర్చ.. ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖను అవమానించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పైన కూర్చున్నారు.. ఇంతకు మించిన దారుణం ఉంటుందా.. దళితులను ఈ స్థాయిలో చిన్నచూపు చూస్తున్నారు.. బీసీలను అణగదొక్కుతున్నారు.చివరికి ప్రభుత్వ ప్రకటనల్లోనూ రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే వేస్తున్నారు.. ఇక ఎమ్మెల్సీ కవిత అయితే రేవంత్ క్షమాపణ చెప్పాలని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇది దళితులకు జరిగిన అన్యాయమని… ఇలా రకరకాల విశ్లేషణలు.. వాదనలు.. ఇంతకీ ఇందులో ఎవరి వాదన కరెక్టు? ఎవరి విశ్లేషణ కరెక్టు?

వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకు విపరీతమైన వేగంగా ఉంది. చిన్న సంఘటన జరిగినా, చీమ చిటుక్కుమన్నా.. వెంటనే అది వ్యాపిస్తోంది. అది నిజమో? అబద్దమో అనవసరం? ఎంతవరకు సర్క్యులేట్ అయ్యిందనేదే ముఖ్యం.. సోమవారం కూడా అదే జరిగింది.. యాదగిరిగుట్టలో పూజల కోసం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వెళ్లారు. అక్కడి పూజల్లో పాల్గొన్నారు. ఇంతవరకు ఉంటే బాగానే ఉండేది. కానీ అక్కడ జరిగిన పూజల్లో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి, మరో ఇద్దరు రెడ్డి మంత్రులు పక్క పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. ఇటు సురేఖ, అటు విక్రమార్క కింద కూర్చున్నారు.. ఇలా ఎందుకు జరిగిందనేదానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని కవిత నుంచి ప్రవీణ్ కుమార్ దాకా డిమాండ్ చేస్తున్నారు. గుడి కాబట్టి అందరూ సమానమే కదా, అలాంటప్పుడు కొందరు కుర్చీలో ఎందుకు కూర్చోవాలి? ఇంకా కొందరు కింద ఎందుకు కూర్చోవాలి అనేది వారి ప్రధాన ఆరోపణ. వారు చేస్తున్న ఆరోపణకు తగ్గట్టుగానే అక్కడ సన్నివేశం కూడా ఉంది. సో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.

వాస్తవానికి ఏదైనా గుడికి ప్రభుత్వ ప్రముఖులు వెళ్లినప్పుడు అక్కడి ఆలయం మర్యాదలతో దర్శనం కల్పిస్తారు. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. అక్కడిదాకా ఎందుకు అప్పట్లో భద్రాచలం రాములవారికి కళ్యాణం సమయంలో ముఖ్యమంత్రి మనవడు తన చేతులతో తలంబ్రాలు సమర్పించాడు. దానిని ప్రతిపక్షాలు ఆక్షేపించినప్పటికీ అప్పటి అధికార ప్రభుత్వం లెక్కపెట్టలేదు. అయితే సోమవారం యాదగిరిగుట్ట లో జరిగిన ఘటనలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. కుర్చీల్లో కూర్చోవడం ద్వారా రెడ్డి అనే వాదాన్ని సోషల్ మీడియా వేదికగా గులాబి పార్టీ శ్రేణులు సర్క్యూలేట్ చేస్తున్నారు.. అయితే దీనికి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమాధానం చెప్పలేదు. మరోవైపు కింద కూర్చోవడం వారికి ఇష్టమైనప్పుడు.. మధ్యలో మీ నస ఏంటని గులాబీ శ్రేణులకు కొంతమంది నెటిజెన్లు కౌంటర్ ఇస్తున్నారు. అంతకుముందు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పక్కన భట్టి విక్రమార్కు కూర్చున్నారు. ఆ సమయంలో కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చున్నారు. మరి అప్పుడు రెడ్డి సామ్యం మీకు గుర్తుకు రాలేదా అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి సోమవారం యాదగిరిగుట్టలో జరిగిన ఉదంతాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రచారం చేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version