HomeతెలంగాణTGSRTC Cargo Service : TGSRTC గుడ్‌ న్యూస్‌.. ఇక బస్టాండ్‌కు వెళ్లే అవసరం లేదు.....

TGSRTC Cargo Service : TGSRTC గుడ్‌ న్యూస్‌.. ఇక బస్టాండ్‌కు వెళ్లే అవసరం లేదు.. దసరా నుంచి కొత్తగా సర్వీస్‌లు..

TGSRTC Cargo Service : తెలంగాణలో నష్టాల బాటలో ఉన్న అనేక కార్పొరేషన్లలో ఆర్టీసీ కూడా ఒకటి. నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ.. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో టికెట్‌ చార్జీలు పెంచింది. బస్టాండ్లను ఆధునికీకరించింది. సౌకర్యాలు కల్పించింది. కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. కార్గో సర్వీస్‌ల ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తోంది. అయితే మహిళల ఉచిత ప్రయాణంలో మళ్లీ సంస్థకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో సంస్థను గట్టెక్కించేందకు మరోమారు సంస్థ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆదాయం వచ్చే మరో మార్గం అన్వేశించింది. దీంతో ప్రయాణికులతోపాటు, సంస్థకూ లాభం కలుగుతుంది. కార్గొ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటి వరకు బస్టాండ్‌కు కొరియర్‌ సర్వీస్‌ అందిస్తున్న ఆర్టీసీ.. ఇకపై ఇంటింటికీ సర్వీస్‌ అందించాలని నిర్ణయించింది. దసరా నుంచి ఈ సేవలను ప్రారంభించేందుకు చర్యలు చేపటì ్టంది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులు తీసుకెళ్లి.. ఇచ్చిన అడ్రస్‌కు డోర్‌ డెలివరీ చేస్తారు.

హైదాబాద్‌లో ముందుగా..
ఇంటింటికీ కార్గో సన్వీస్‌ను మొదట హైదరాబాద్‌లో ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్డర్‌ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీల్‌ ద్వారా డెలివరీ చేస్తారు. హైదరాబాద్‌లో సక్సెస్‌ అయిన తర్వాత అన్ని జిల్లాలలో దీనిని అమలు చేయనుంది. ప్రస్తుతం కార్గో సేవలు బస్‌ స్టేషన్‌ నుంచి బస్టేషన్‌ వరకు మాత్రమే ఉన్నాయి. ఇక నుంచి ఇంటింటికీ పార్శిల్‌ తీసుకెళ్లడం, ఇంటి నుంచి తీసుకురావడం వలన వినియోగదారులకు ఇబ్బందులు తప్పుతాయి. తాజా నిర్ణయంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త బస్సులు ప్రారంభం..
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఆరు డిపోల నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ బస్సులను నడపనుంది. కరీంనగర్‌ –2, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌–2 డిపోల నుంచి ఈ బస్సులు నడుపుతుంది. కరీనంగర్‌–2 డిపోలో మొదట 35 బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభిస్తారు. ఈ బస్సులు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌జేబీఎస్‌కు, మంథని, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్‌స్టాప్‌ పద్ధతిలో నడుపుతారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version