Telangana 10th class results 2026: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు జరిగాయి. మూల్యాంకనం పూర్తి కావడంతో విద్యాశాఖ ఫలతాలు విడుదల చేసింది. మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత సాధించార. ఈ ఫలితాల్లో బాలికలు 93.23 శాతంతో బాలురు 89.42 శాతం సాధించారు. ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇక ఫలితాల్లో ములుగు జిల్లా 99.30 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాద్ 89.23 శాతంతో చివరిస్థానంలో నిలిచింది.
5,731 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 10 వేల మంది ప్రైవేటు అభ్యర్థులు కూడా పాల్గొన్నారు.
విడుదల వివరాలు
హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్లు ఫలితాలను ప్రకటించారు. గ్రేడులతో పాటు మార్కుల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ వెబ్సైట్లలో ఫలితాలు..
results.bsetelangana.org, https://results.bsetelangana.org, bse.telangana.gov.in, https://bse.telangana.gov.in, schooledu.telangana.gov.in, https://schooledu.telangana.gov.in
వాట్సాప్ నంబర్ : 8096958096
గతేడాదికన్నా మెరుగు..
గతేడాది 92.78 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయి. బాలికలు నాలుగు ఏళ్లుగా పైచేయి సాధిస్తున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్లో జరిగే అవకాశం ఉంది.