HomeతెలంగాణTelangana Liquor Price Hike: త్వరలో మద్యం ధరల పెంపు.. ఎంత పెరుగుతుందంటే..

Telangana Liquor Price Hike: త్వరలో మద్యం ధరల పెంపు.. ఎంత పెరుగుతుందంటే..

Telangana Liquor Price Hike: తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మద్యం ధరలు చివరిసారిగా 2023 మే నెలలో పెంచారు. ఆ తరువాత ఏడాదికిపైగా మద్యం ధరలు స్థిరంగా ఉండటంతో ప్రస్తుతం మరోసారి పెంపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ డిస్టిలరీల ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ కమిటీలో ఆర్థిక, ఆమోదం, పరిశ్రమ శాఖల అధికారులు ఉన్నారు. ధరల పెంపునకు కారణాలు నివేదించనున్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, పన్నులు, రవాణా ఖర్చులు అధికమవడంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ బ్రాండ్ పై ఎంత ధర ఉండనుంది అంటే?

మద్యం ధరలు గత రెండేళ్లుగా స్థిరంగా కొనసాగాయి. దీంతో డిస్టిలరీలు నష్టాలు చవిచూస్తున్నాయని తెలుపుతున్నారు. దీంతో వారి ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం నియమించిన కమిటీకి నివేదించారు. దీనిపై కమిటీ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా సాధారణ బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.60, ప్రీమియం బ్రాండ్‌లపై రూ.100, హయ్యర్ కేటగిరీ బ్రాండ్‌లపై రూ.120 పెంపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే డిస్టిలరీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగానే పెంపు ఉంటుందని సమాచారం. రెండేళ్లకోసారి జరిగే ధరల సవరణ ఈసారి ఆలస్యం అయ్యింది. కాబట్టి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి.

ఈ ధరల పెంపు ప్రజల జీబితంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మద్యంపై ఆసక్తి ఉన్నవారికి ఖర్చు ఎక్కువవుతుంది. అయితే ప్రభుత్వం దీని ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. గతంలో కూడా ఇలాంటి పెంపులు జరిగాయి. ఈసారి పెంపు మేర తక్కువగా ఉంటే కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
అధికారిక ప్రకటన తర్వాత బార్లు, వైన్సులల్లో కొత్త ధరలు అమలవుతాయి. డిస్ట్రిక్ట్‌ల వారీగా మార్కెటింగ్ విభాగం పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని విమర్శిస్తున్నాయి. మద్యం ధరల పెంపు రాష్ట్ర ఆర్థికాలకు ఎలా దోహదపడుతుందో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం బీర్ల గరిష్ఠ చిల్లర ధర (MRP)పై సుమారు 15 శాతం పెంపు జారీ చేసింది. దీంతో లైట్‌ బీర్ దాదాపు రూ.150 నుంచి సుమారు రూ. 180కి పెరిగింది. స్ట్రాంగ్ బీర్ రూ.160 నుంచి దాదాపు రూ.190కి పెరిగింది. మరికొన్ని ప్రీమియం బ్రాండ్లలో ఒక్కో బీర్‌పై సగటున రూ.30 నుంచి 40 వరకు పెంచారు. అయితే మద్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బీర్ల ధరలు పెరుగుతాయా..? చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version