HomeతెలంగాణTelangana TDP: తెలంగాణలో టిడిపి.. చంద్రబాబుకు టచ్ లోకి ఆ నేతలు!

Telangana TDP: తెలంగాణలో టిడిపి.. చంద్రబాబుకు టచ్ లోకి ఆ నేతలు!

Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి టిడిపి అక్కడ యాక్టివ్ అయ్యేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన నేతలంతా ఇప్పుడు చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నట్లు సమాచారం. పార్టీని యాక్టివ్ చేస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తమ ప్రతిపాదనను చంద్రబాబు ఎదుట పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ప్రస్తుతం అక్కడ పార్టీకి నాయకత్వం లేదు కానీ.. క్యాడర్ ఇప్పటికీ కొనసాగుతోంది. టిడిపి అభిమానులు కూడా ఎక్కువే. గ్రేటర్ తో పాటు సెటిలర్స్ ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి. అటువంటి చోట్ల మాత్రం టిడిపి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది.

* మోదీ టూర్ తో..
మొన్న తెలంగాణలో పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దాదాపు పదివేల కోట్ల రూపాయల నిర్మాణాలకు సంబంధించి హైదరాబాదులో శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో అయితే గంటల తరబడి చర్చించారు. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి నడుస్తోంది మూడు పార్టీలతో. తెలంగాణలో సైతం మూడు పార్టీలు ఏకతాటి పైకి వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది. అయితే గతంలో మాదిరిగా ప్రత్యేక రాష్ట్ర భావన లేదు. ఇప్పుడు అంతా అభివృద్ధి అజెండాగా సాగుతోంది తెలంగాణ రాజకీయం. తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేసేందుకు ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దల ఆదేశాలతో గ్రేటర్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పొత్తు ఉండబోతుందనేది ఒక అంచనా.

* బలమైన కేడర్..
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టింది తెలంగాణలో. ఎన్టీఆర్ బలమైన పునాదులు ఏర్పాటు చేశారు. అవి తెలంగాణలో ఎక్కువగా నాటుకున్నాయి కూడా. మధ్యలో ప్రత్యేక రాష్ట్రం వాదంతో తెలుగుదేశం కాస్త ఇబ్బంది పడింది. ప్రతి దానికి చంద్రబాబు బూచి ని చూపించి రాజకీయం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పుష్కరకాలం దాటుతున్న క్రమంలో క్రమేపి ప్రాంతీయ వాదం బలహీనపడుతోంది. అభివృద్ధి మంత్రం పతాక స్థాయికి చేరుకుంటుంది. అందుకే ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి నడుస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

* టిడిపి నాయకులే అధికం..
తెలంగాణలో ప్రస్తుతం అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు ఎక్కువగా టిడిపి నుంచి వెళ్లిన వారి. గులాబీ పార్టీలో అయితే ఆ పార్టీ బాస్ కెసిఆర్ నుంచి దిగువ స్థాయి కేడర్ వరకు అంతా టిడిపి దే. కాంగ్రెస్ పార్టీలో కూడా మెజారిటీ నాయకత్వం టిడిపి నుంచి వెళ్ళింది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో.. ఆ పార్టీలో ఉన్న పూర్వపు టిడిపి నేతలు అంతా పూర్వాశ్రమం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేస్తే చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే చంద్రబాబుకు చాలామంది టచ్లోకి వచ్చారట. సరైన సమయం చూసి చెబుతానని బాబు చెప్పారట. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular