HomeతెలంగాణBandi Sanjay Son Sai Bhagirath: ‘బండి’కి తనయుడి తలపోటు.. మొన్న దాడి.. నేడు పోక్సో?

Bandi Sanjay Son Sai Bhagirath: ‘బండి’కి తనయుడి తలపోటు.. మొన్న దాడి.. నేడు పోక్సో?

Bandi Sanjay Son Sai Bhagirath: బండి సంజయ్‌ కరుడుగట్టిన హిదుత్వవాది. బీజేపీ కోసం, హిందుత్వం కోసం ఎంతకైనా తెగించే నేత. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న బండి సంజయ్‌ కార్పొరేటర్‌గా కరీంనగర్‌లో రాజకీయం మొదలు పెట్టాడు. అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పార్టీకి తెలంగాణలో మంచి ఊపు తెచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా వద్ద బండికి మంచి గుర్తింపు ఉంది. అయితే కష్టపడి ఎదిగిన బండికి పుత్రుడు తలనొప్పిగా మారాడు. గతంలో హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో సహచర విద్యార్థులపై దాడిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.

హనీట్రాప్‌ అని ఫిర్యాదు..
కొంపల్లి కుటుంబం తన కూతురును అడ్డు పెట్టుకుని బండి సంజయ్‌ కొడుకు సాయి భగీరథ్‌ను హనీట్రాప్‌లోకి లాగి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ కుటుంబం భగీరథ్‌తో సంబంధం ఉన్న వీడియోలు ఉపయోగించి రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తోందని, డిసెంబర్‌ నుంచి ఇది కొనసాగుతోందని పేర్కొంటున్నాడు. ఇలాంటి కేసుల్లో మొదట్లో బాధితుడు భయం, సామాజిక సమస్యల కారణంగా ఫిర్యాదు చేయలేదు. కానీ నిందితుడు ఇక్కడ రాజకీయ నేత కొడుకు కావడం ఈ అంశాన్ని మరింత కాంప్లికేటెడ్‌గా మారుస్తోంది.

మైనర్‌ను అడ్డం ఫెట్టుకుని..
ఓ మహిళ మైనర్‌ అయిన తన కూతరును అడ్డం పెట్టుకుని హనీట్రాప్‌కు యత్నించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకే భగీరత్‌ ఇప్పుడు కేసు పెట్టారని పేర్కొంటున్నారు. ఇది హనీట్రాప్‌‑సైబర్‌ ఎక్సా్టర్షన్‌ కేసు కావచ్చు, లేదా యువ ప్రేమకథను వాడుకుని చేసిన పెద్ద కుట్ర కావచ్చు.

ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు?
డిసెంబర్‌ నుంచి బ్లాక్‌మెయిల్‌ జరుగుతోందని చెప్పినా ఫిర్యాదు మాత్రం ఇప్పుడు ఎందుకు చేశాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తాజాగా కరీంనగర్‌ టూటౌన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

రాజకీయ డ్యామేజ్‌ కుట్ర..
బండి సంజయ్‌ అనుచరవర్గం ఈ హనీట్రాప్‌ కేసును స్పష్టమైన రాజకీయ కుట్రగా చిత్రిస్తోంది. బండి సంజయ్‌ను ఎదుర్కొనలేకనే వారి కుటుంబ ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హనీట్రాప్, బ్లాక్‌మెయిల్, సైబర్‌ క్రై మ్‌ లాంటి పదాలతో సాధారణ ప్రజల మనస్సుల్లో కుటుంబం మీద ప్రతికూల ఇమేజ్‌ పెంచడం లక్ష్యమని వారు చెబుతున్నారు.

లైంగికదాడి చేసినట్లు ఆరోపణ..
బరోవైపు బాధితురాలిగా చెబుతున్న బాలిక బగీరథ్‌ తనపై రెండుసార్లు లైంగికదాడి చేసినట్లు ఆరోపస్తోంది. ఈమేరకు హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం వల్ల ఆమె రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, ఇప్పుడు అస్వస్థత, మానసిక ఆందోళనతో బాధ పడుతున్నట్లు బాలిక తల్లితండ్రులు చెబుతున్నారు.

పేట్‌ బషీరాబాద్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌..
బాలిక తల్లితండ్రులు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే బండి సంజయ్‌ ఒత్తిడికి పోలీసులు తలొగ్గే ప్రమాదం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లే ఆరోచనలో బాధితులు ఉన్నట్లు సమాచారం.

బండి సంజయ్‌ తనయుడు సాయి భగీరథ్‌పై ఇది మొదటి వివాదం కాదు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో, మహీంద్ర యూనివర్సిటీలో గొడవలు జరిగిన కేసులు ఉన్నాయి. తాజాగా పోక్సో కేసు ఘటన, హనీట్రాప్‌ అంశాలు సంచలనంగా మారాయి. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version