ప్రతి నిరుద్యోగికీ కేసీఆర్ రూ. లక్ష బాకీ.. రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ మామీలు ఇచ్చారని ప్రతి నిరుద్యోగికీ కేసీఆర్ రూ. లక్ష బాకీ ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పథకాలను – పైన పటారం- లోన లోటారం అన్నట్లు రచించారుని అన్నారు.  అమరుల త్యాగాలకు విలువలేకుండా టీఆరెస్ పాలన సాగుతోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 9వరకు కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. డిసెంబర్ 9న విద్యార్థి […]

Written By: Suresh, Updated On : September 29, 2021 3:29 pm

Revanth Reddy ignoring seniors

Follow us on

టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ మామీలు ఇచ్చారని ప్రతి నిరుద్యోగికీ కేసీఆర్ రూ. లక్ష బాకీ ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పథకాలను – పైన పటారం- లోన లోటారం అన్నట్లు రచించారుని అన్నారు.  అమరుల త్యాగాలకు విలువలేకుండా టీఆరెస్ పాలన సాగుతోంది.

డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 9వరకు కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. డిసెంబర్ 9న విద్యార్థి యువజన భారీ కార్యక్రమం ఉంటుదన్నారు. మలిదశ ఉద్యమానికి శ్రీకాంతాచారి మొదటి అమరుడయ్యారు. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు.K TO PG ఉచిత విద్య ఉమ్మడి అందించేందుకు ఫీజు రియంబర్స్ మెంట్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రేస్ తెచ్చింది. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల వల్ల వేలమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

బకాయిలు ఉన్న 4వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలడి డిమాండ్ చేశారు.  నిరుద్యోగ భృతి ఇస్తారా? ఇవ్వరా అనేది స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 60లక్షల మంది పట్టబద్రులు నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ 1లక్ష రూపాయలు భాకి ఉన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్- నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్ నియామకం పై పోరాటం చేస్తాం. విద్యార్థి నిరుద్యోగ జంక్ సైరన్ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం ఉంటుందన్నారు. దిలీషుఖ్నగర్ చౌరస్తా నుంచి పాదయాత్ర చేస్తూ ఎల్బీ నగర్ వరకు వెళతాం తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలు ఆగాలంటే సోనియమ్మ రాజ్యం రావాలని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రం కంటే ఇవ్వాళ తెలంగాణ అత్యధికంగా ప్రమాదంలో ఉంది. హుజురాబాద్ ఎన్నికపై మాకు వ్యూహం ఉంది. హుజురాబాద్ అభ్యర్థి పై సీఎల్పీ నేతృత్వంలో కమిటీ ఉంది. రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుంది. హుజురాబాద్ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, మాతో కలిసి వచ్చే పార్టీలను- వ్యక్తులను కలుపుకుంటాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.