HomeతెలంగాణHyderabad MMTS Free Travel: రేవంత్‌ మరో గొప్ప నిర్ణయం.. హైదరాబాద్‌ ప్రజలు ఫుల్‌ హ్యాపీ

Hyderabad MMTS Free Travel: రేవంత్‌ మరో గొప్ప నిర్ణయం.. హైదరాబాద్‌ ప్రజలు ఫుల్‌ హ్యాపీ

Hyderabad MMTS Free Travel: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి మరో శుభవార్త చెప్పబోతున్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలవుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. రైతుభరోసా చెల్లింపు విషయంలోనే కాస్త ఆలస్యం జరుగుతోంది. ఈ క్రమంలో మరో గుడ్‌ న్యూస్‌ జూన్‌ 2న చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్మెంట్‌ స్కీమ్‌(ఎంఎంటీఎస్‌) రైళ్లలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం అందించే నిర్ణయం తీసుకన్నారు. ఏడాదిపాటు దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం. ఏడాది తర్వాత ట్రాఫిక్‌ తగ్గుదల, పొల్యూషన్‌ మెరుగుదల సానుకూలంగా ఉంటే, దీన్ని శాశ్వతంగా కొనసాగిస్తారని సమాచారం. దక్షిణాంచల్‌ రైల్వేకు పంపిన అధికారిక లేఖలో ఎంఎంటీఎస్‌ ద్వారా రైల్వేకు వచ్చే ఏడాదికి సుమారు రూ.10 కోట్ల టికెట్‌ ఆదాయాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని స్పష్టం చేశారు. ఇది రైల్వే ఆపరేషన్లకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా అమలు చేయడానికి రూపొందించారు.

రోజుకు 2.5 లక్షల మంది జర్నీ..
ఎంఎంటీఎస్‌లలో ప్రస్తుతం నిత్యం 2.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వంద కిలోమీటర్లకుపైగా నెట్‌వర్క్‌తో హైదరాబాద్, సికింద్రాబాద్, కుకట్‌పల్లి, లింగంపల్లి, ఫలాక్‌నుమా, ఉప్పల్, హీదరాబాద్‌ డీకన్‌ వంటి 50+ స్టేషన్లను కవర్‌ చేస్తూ, రోజుకు 150+ రైళ్లు నడుపుతుంది. రోజువారీ 2.5 లక్షల మంది ప్రయాణికులు (పీక్‌ అవర్స్‌లో 80 శాతం ఫుల్‌ ఆక్యుపెన్సీ) ఉపయోగిస్తున్నారు. సగటు టికెట్‌ ధర రూ.10 నుంచి రూ.20 మధ్య ఉండటంతో, ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం వస్తోంది. ఫ్రీ జర్నీతో ప్రయాణికుల సంఖ్య 50 శాతం పెరిగి 3.75 లక్షలకు చేరవచ్చని అంచనా. దీంతో రోడ్ల మీద 5 నుంచి 10 వేల వాహనాలు తగ్గే అవకాశం.

ట్రాఫిక్, పొల్యూషన్‌ తగ్గింపు లక్ష్యంగా..
హైదరాబాద్‌లో రోజుకు 40 లక్షల వాహనాలు రోడ్లపై ఉంటాయి. దీంతో కాలుష్య స్థాయి 60 నుంచి 100 వరకు నమోదవుతుంది. సాధారణంగా 15 శాతంలోపు ఉండాలి. ఎంఎంటీఎస్‌ అయితే రోడ్‌ ట్రాఫిక్‌ 20–30 శాతం తగ్గి, కర్బన ఉద్గారాలు 15 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని అంచనా. ఉదాహరణకు, బెంగళూరులలో ప్రీ మెట్రోతో రోడ్‌ ట్రాఫిక్‌ 18 శాతం తగ్గింది. ఇక్కడ కూడా సారూప్యం ఆశించవచ్చు.

ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు..
రూ.10 కోట్ల ఖర్చుతో ప్రారంభమైనా, ప్రయాణికుల పెరుగుదలతో రైల్వే ఇతర ఆదాయాలు (అడ్వర్టైజింగ్, స్పాన్సర్‌షిప్‌) పెరిగి, 2–3 సంవత్సరాల్లో రాబడి వస్తుంది. సామాజికంగా, రోజుకు రూ.5 నుంచి రూ.10 కోట్ల ప్రయాణ ఖర్చు ఆదా అవుతుంది. మధ్యస్థ తరగతి (ఉద్యోగులు, విద్యార్థులు)కు లోపలి మొబిలిటీ పెరుగుతుంది. ఆదాయ పెరుగుదలతో ఈ–కామర్స్, రిటైల్‌ సెక్టార్లు బూస్ట్‌ అవుతాయి.

అమలు ఎలా?
ప్రీ అనగానే ప్రయాణికుల ఒత్తిడి (ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లు), టికెట్‌ చెకింగ్‌ వ్యవస్థ మార్పు ఉంటుంది. అదనపు రైళ్ల అవసరం. ఎంఎంటీఎస్‌ అంగీకారం, స్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌ కీలకం. పర్యవేక్షణకు డ్యాష్‌బోర్డ్‌ (ట్రాఫిక్‌ కౌంటర్లు, ఎయిర్‌ క్వాలిటీ సెన్సర్లు) అవసరం. విఫలమైతే, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇమేజ్‌ దెబ్బతింటుంది.

ఈ పైలట్‌ విజయవంతమైతే, ముంబై, చెన్నై లాంటి సిటీలకు మోడల్‌గా హైదరాబాద్‌ మారుతుంది. ప్రభుత్వం ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌లు (అదనపు కోచెస్‌) పరిగణించవచ్చు. డేటా–డ్రివెన్‌ ఎవాల్యుయేషన్‌తో గ్రీన్, సస్టైనబుల్‌ మొబిలిటీకి బలమైన అడుగు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version