https://oktelugu.com/

CM Revanth Reddy: కేసీఆర్‌ ప్రాణాలకు వారితోనే ముప్పు.. అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం సంచలన ప్రకటన!

తెలంగాణ(Telangana)లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో నిత్యం రాజకీయాలను వేడిగా ఉంచుతున్నారు ఇరు పార్టీల నేతలు. ఈ క్రమంలో ఇటీవల స్ట్రెచర్‌(Strechar) వ్యాఖ్యలు దుమారం చేపాయి. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రాణహానిపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు.

Written By:
  • Ashish D
  • , Updated On : March 15, 2025 / 03:05 PM IST
    CM Revanth Reddy (3)

    CM Revanth Reddy (3)

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్‌ఎస్‌ నేతలు నిత్యం విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి నాడు పీసీసీ చీఫ్‌గా, నేడు సీఎంగా బీఆర్‌ఎస్‌(BRS) నేతల వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి 2020లో, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ (కె. తారక రామారావు)పై రాజకీయ దాడులు చేస్తున్నారు. 2020, జనవరి 5న గడ్డియన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌(Congress)లో చేరిన సందర్భంగా రేవంత్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్‌ అధికార దాహంతో ఉన్నాడు. కుటుంబంలో అధికారం కోసం జరుగుతున్న పోటీలో, కేటీఆర్‌ రాత్రి సమయంలో తన తండ్రిని నిద్రలో చంపే ప్రయత్నం చేయవచ్చని నాకు సందేహం ఉంది. కేసీఆర్‌ తన కుటుంబం గురించి జాగ్రత్తగా ఉండాలి.‘ ఈ వ్యాఖ్యలు కేసీఆర్‌ కుటుంబంలో అంతర్గత విభేదాలను సూచిస్తూ, ఆయన సెక్యూరిటీని పెంచుకోవడానికి దీన్నే కారణంగా చూపేలా రేవంత్‌ వ్యంగ్యంగా మాట్లాడారు. అదే సమయంలో, కేటీఆర్‌ ప్రగతి భవన్‌(Pragathi Bhavan)ను ఖాళీ చేయాలని కేసీఆర్‌ను కోరమని కూడా రేవంత్‌ సూచించారు.

    Also Read: వైసీపీలో అధినేత మనసులో.. జనసేనలో ద్వితీయ శ్రేణి నేతలతో.. మాజీ మంత్రిపై వీడియో వైరల్!

    తాజాగా సీఎం హోదాలో…
    తాజాగా ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మరోమారు మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాణాలకు ముప్పు ఉందని ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్‌సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు ప్రాణహాని ఉంటే.. అది ఆయన కుటుంబ సభ్యులు నుంచే అని పేర్కొన్నారు. ఆయన సెక్యూరిటీ గురించి ఇక తాను మాట్లాడడని తెలిపారు. ఆయనకు ఇప్పటికే ఉన్న జడ్‌–ప్లస్‌ సెక్యూరిటీ వంటి ఉన్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు ఉండేవి, ఇది రాష్ట్ర నాయకుడిగా సాధారణం. అయితే
    రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలను తన రాజకీయ వ్యూహంలో భాగంగా, కేసీఆర్‌ కుటుంబంపై విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, ప్రజల్లో చర్చను రేకెత్తించేందుకు చేసినట్లు భావించవచ్చు.