HomeతెలంగాణKarimnagar Fake Swami: మీ భర్తలు ఆ పనిచేయడం లేదా.. నేనున్నాను.. మర్చిపోవద్దు..

Karimnagar Fake Swami: మీ భర్తలు ఆ పనిచేయడం లేదా.. నేనున్నాను.. మర్చిపోవద్దు..

Karimnagar Fake Swami: ప్రస్తుతం మనం సాంకేతిక కాలంలో ఉన్నాం. చిటిక వేస్తే చాలు ఏదైనా తెలుసుకునే పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నాం. మొండి వ్యాధులకు మందులు కనిపెడుతున్నాం. వర్షాలు ఎప్పుడు కురుస్తాయి.. కరువులు ఎప్పుడు వస్తాయి.. ఇలా అనేక విషయాలను వెంటనే చెప్పేస్తున్నాం. అంతేకాదు అతి త్వరలో చంద్రుడి మీద నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఇంతటి కాలంలో.. ఈ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న మనం.. కొన్ని విషయాలలో మాత్రం మూస ధోరణిలో ఉంటున్నాం. ఇదే అదునుగా కొంతమంది రెచ్చిపోతున్నారు. దైవంశ సంభూతులుగా మారిపోతున్నారు.

నేటికీ గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది వ్యక్తులు గురువులుగా చలామణి అవుతున్నారు. తమను స్వయం ప్రకటిత దేవుళ్ళుగా ప్రకటించుకుంటున్నారు.. అంతేకాదు విచిత్రమైన వేషాలు వేసుకుంటూ.. చిత్రమైన మాటలు మాట్లాడుతూ.. గుర్రాల మీద.. ప్రత్యేకమైన వాహనాల మీద సంచరిస్తూ ప్రజలను మాయలో పడేస్తున్నారు. అంతేకాదు.. సమస్యలు ఉన్నాయని.. మంత్రాలు చేశారని.. భూతాల పీడ ఉందని అంటున్నారు. ఇటువంటివి కామనే అంటారా. అయితే అందులో ఇతడు ఏకంగా పీహెచ్డీ చేశాడు. వెంట్రుక వాసిలో తప్పిపోయింది గాని.. పోలీసులు సమయానికి వచ్చి ఉంటే ఇతడి వీపు సాపు అయ్యేది..

కరీంనగర్ జిల్లాలోని చందుర్తి.. వేములవాడ మండలాల్లో పలు గ్రామాలలో ఇటీవల ఒక దేశ గురువు సంచరించాడు. జుట్టు పెంచుకున్నాడు. మెడలో మాలలు వేసుకున్నాడు. చుట్టూ పసుపు పంచ ధరించాడు. గుర్రం మీద ఎక్కి గ్రామాలలో తిరిగాడు. అక్కడితోనే ఇతడి వ్యవహారం ఆగిపోలేదు. పలువురి గృహాలకు వెళ్ళాడు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని అడ్డదిడ్డంగా మాట్లాడాడు. మీ మొగుళ్ళు సుఖ పెడుతున్నారా.. దగ్గరగా ఉంటున్నారా.. మీరు నా వైపు రండి. నేను ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోవద్దు అంటూ చేతులతో రకరకాల సంకేతాలు చేశాడు. బూతు మాటలు మాట్లాడాడు. మొదట్లో అతడి వ్యవహారం మహిళలకు అర్థం కాలేదు. ఆ తర్వాత అతడి మీద తిరగబడ్డారు. వ్యవహారం చేయి దాటిపోతున్న నేపథ్యంలో అతడి శిష్యులు రంగంలోకి దిగారు. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి.. అందువల్లే స్వామీజీ అలా ప్రవర్తిస్తున్నారు అంటూ కవరింగ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మహిళలకు ఆగ్రహం మరింత పెరిగి దుమ్ము దులపడానికి ప్రయత్నించారు. అంతకుముందు ఆ స్వామీజీ శిష్యులు ఆయా గ్రామాలలో డబ్బులు వసూలు చేశారు. అయితే ఈ వ్యవహారం తెలిసిన తర్వాత ఖాకీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు రంగంలోకి దిగడంతో.. అప్పటికే ఆ స్వామీజీ తన అనుచరులతో జారుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version