HomeతెలంగాణKarimnagar Congress Internal Conflict: కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ముసలం.. రచ్చకెక్కిన విభేదాలు!

Karimnagar Congress Internal Conflict: కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ముసలం.. రచ్చకెక్కిన విభేదాలు!

Karimnagar Congress Internal Conflict: కాంగ్రెస్‌ అంటేనే కయ్యాల పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువ. ఒక నేత ఎదుగుదలను మరో నేత ఓర్వులేడు. ఒకరి ఆధిపత్యాన్ని మరోకరు సహించరు. ఎవరికి వారు గ్రూపులుగా ఉంటారు. అవసరమైతే అధిష్టానాన్ని కూడా బూతులు తిడతారు. తర్వాత కలిసే ఉంటారు. ఏమన్నా అంటే స్వేచ్ఛ, స్వాతంత్య్రం అని పెద్దపెద్ద మాటలు చెబుతారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలో కొన్నాళ్లు కయ్యాలు కనిపించలేదు. కానీ ఆరు నెలలుగా లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా కరీనంగర్‌లో బిభేదాలు రచ్చకెక్కాయి. కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ఇన్‌చార్జి నియామకం వివాదం పార్టీ ఐక్యతను దెబ్బతీసింది. స్థానిక నేతల అసంతృప్తి, అధిష్ఠాన నిర్ణయాలపై బహిరంగ తిరస్కారం శ్రేణుల్లో గందరగోళాన్ని మురికి చేస్తోంది.

నియామకంతో వివాదం
వెలిచాల్‌ రాజేందర్‌ రావును కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం పలువురు స్థానిక నాయకుల అభ్యంతరానికి దారితీసింది. సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు తమ పేర్లతో వినతిపత్రాలు సమర్పించారని, తమ సమ్మతి లేకుండానే జరిగిందని మండిపడ్డారు. సన్నాహక సమావేశాల్లోనే విభేదాలు బహిర్గతమై, గొడవల వరకు వెళ్లింది.

వెలిచాల టార్గెట్‌గా..
మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌లాంటి మునుపటి నాయకులు పార్టీ నాయకత్వంపై ఫైర్‌ అవుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్‌ ఇన్‌చార్జి వెలిచాల్‌ రాజేందర్‌ రావును లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో సహకారం లేకపోవడం, టికెట్‌ కేటాయింపుల్లో భేదం వంటి ఆరోపణలు ఉన్నాయి. డీసీసీ కార్యాలయంలో రహస్య సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మూడుముక్కలాట..
కరీంనగర్‌ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట జరుగుతోంది. గత మున్సిపల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 66 డివిజన్లలో కేవలం 14 సీట్లకే పరిమితమైంది. ఇన్‌చార్జి లేకపోవడం, జిల్లా అధ్యక్ష పదవి ఆలస్యం ఈ సమస్యలకు ఆధారం. మంత్రివర్గ విస్తరణలో కూడా స్థానికులకు ప్రాధాన్యత లేకపోవడంపై నిరాశ వ్యక్తమవుతున్నారు. ఈ వివాదం పీసీసీ స్థాయికి చేరి, సస్పెన్షన్‌ డిమాండ్లు ఉయరుతున్నాయి. ఎన్నికల విషయాల్లో పార్టీ బలం తగ్గుతున్న ఈ ప్రాంతంలో ఇది మరింత దెబ్బ తీస్తుంది.

అధిష్టానం త్వరగా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించి, పునర్నియామకాలు చేయాలి. పారదర్శకత, స్థానిక ప్రాతినిధ్యం పెంచితే శ్రేణులు ఏకతాటిపై నడవవచ్చు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో మూడో స్థానానికి మాత్రమే పరిమితమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version