తెలంగాణFamily: ఇదేందయ్యా ఇది.. ఈ కాలంలో ఇంత అన్యోన్యతా.. ఈ వింత ఎప్పుడు మేం...

Family: ఇదేందయ్యా ఇది.. ఈ కాలంలో ఇంత అన్యోన్యతా.. ఈ వింత ఎప్పుడు మేం చూడలా!

Family: కలిసుంటే కలదు సుఖం.. కమ్మని సంసారం.. అని ఓ సినిమాలో పాట విన్నాం. అంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉంటే ఆ అనుబంధాలు.. ఆ అన్యోన్యత.. ఆ ప్రయోజనాలు వేరు. ప్రస్తుతం ప్రపంచం ఆధునికం వైపు పరుగులు పెడుతున్నప్పటికీ ఉమ్మడి కుటుంబాల జాడే లేకుండా పోయింది. టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ బంధాలు అంత దూరం అవుతున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు.

ఒకప్పుడు పల్లె జీవనం వేరు. పల్లెలు అంటే బతుకు భరోసా అన్న ఫీలింగ్ ఉండేది. పల్లెల్లో ఉమ్మడి కుటుంబాల సంఖ్య వేలల్లో. అలాంటి పల్లెలు కూడా ఆధునికత వైపు పరిగెడుతున్నాయి. చాలా మంది పల్లెలను వీడి పట్నం బాట పడుతున్నారు. దాంతో పల్లెల్లోనూ ఇలాంటి బంధాలు కనిపించడం లేదు. ఇక ఉమ్మడి కుటుంబాలైతే మచ్చుకైనా కనిపించడం లేదు.

పెళ్లి, ఫంక్షన్లు వచ్చాయంటే ఒకప్పుడు కుటుంబ సభ్యులతో వారం పది రోజుల ముందే ఇళ్లకు చేరుకునే వారు. ఒక పండుగలు వచ్చిన కూడా వారం రోజుల ముందే వచ్చేవారు. వారం రోజుల ముందు నుంచి ఆ ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుండేది. వారం పది రోజుల పాటు ఎంతో ఆనందంగా గడిపేవారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబాల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టే పరిస్థితులు వచ్చాయి. అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటనే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పటికాలం పిల్లలకు ఉమ్మడి కుటుంబం గురించి తెలియని కూడా తెలియదు.

ఇక బతుకమ్మ, దసరా పండుగ వస్తోందంటే గ్రామాల్లో ఉండే సందడి అంతాఇంతా కాదు. ఎక్కడెక్కడో ఉన్న వారైనా కూడా గ్రామాల బాట పట్టేవారు. చివరకు విదేశాల్లో ఉన్న వారు కూడా పండుగను ఘనంగా జరుపుకునేందుకు కన్న ఊరికి చేరుకునే వారు. గ్రామానికి వచ్చి కుటుంబసభ్యులు, చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడిపేవారు. పొలం గట్ల వెంబడి ఎంజాయిగా తిరిగేవారు. కానీ.. ఇప్పుడు చేతిలో ఉన్న సెల్‌ఫోన్లే అందరికీ నేస్తాలయ్యాయి. కుటుంబసభ్యులు కలిసినప్పటికీ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. లేదంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ బిజీగా ఉండిపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బిడ్డలతో మాట్లాడుదామనుకుంటున్న పెద్దలకు ఆ అవకాశం లేకుండా పోతోంది. దాంతో వారు వచ్చిన సంబరం కంటే వారితో మాట్లాడలేకపోతున్నామనే బాధనే వారిలో కనిపిస్తూ ఉంది.

కానీ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఫ్యామిలీ కొత్త రికార్డు సృష్టించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 150 మంది ఒక దగ్గరకు చేరారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన బద్దం వెంకట్ రామవ్వ-కృష్ణారెడ్డి దంపతులు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుటుంబంలోని మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు, వారిక కుటుంబసభ్యులందరూ ఒకే వేదికపైకి చేరుకున్నారు. అలా 150 మంది ఒకే చోట చేరి ఆనందంగా గడిపారు. ఆత్మీయంగా కలుసుకుని ఎంజాయ్ చేశారు. ఉమ్మడి ఫ్యామిలీకి నిదర్శనంగా నిలిచారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Anasuya : అలాంటి బట్టల్లో అనసూయ, భర్త ఏమీ అనడా? స్టార్ యాంకర్ సమాధానం ఇదే

Anasuya : డ్రెస్సింగ్ విషయంలో అనసూయ భరద్వాజ్ ఎదుర్కున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ప్రముఖులు సైతం ఆమె గ్లామర్ షో పై పెదవి విరిచారు. మరి అనసూయను కుటుంబ సభ్యులు ఏమీ అనరా? భర్త అభిప్రాయం ఏమిటీ? ఈ ప్రశ్నలకు అనసూయ స్వయంగా సమాధానం చెప్పింది..

Mokshagna : మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్, మళ్ళీ కథ మొదటికి!

Mokshagna : నందమూరి మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల అంతకంతకు వెనక్కి పోతుంది. బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. కాగా మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ మరింత ఇబ్బంది పెట్టేదిగా ఉంది.

Most Popular

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Harish Rao

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...
Armoor MLA

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...
Ration Card

Ration Card: రేషన్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Ration Card: దేశంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్...