spot_img
Homeటాప్ స్టోరీస్CM Revanth Reddy: ఫస్ట్ హరీష్.. నెక్స్ట్ కేటీఆర్.. ఆ తర్వాత కేసీఆర్.. రేవంత్ టార్గెట్...

CM Revanth Reddy: ఫస్ట్ హరీష్.. నెక్స్ట్ కేటీఆర్.. ఆ తర్వాత కేసీఆర్.. రేవంత్ టార్గెట్ ఫిక్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ గద్దెలు మొత్తం కూలాలని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీని వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏదో రాజకీయ వ్యవహారంలో చేసినవని అందరూ అనుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి వ్యాఖ్యల వెనుక లోతైన వ్యవహారం ఉందని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది.

ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ లోనే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో గులాబీ పార్టీకి అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి ఆక్టివ్ అయింది. ఈసారి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సోమవారం రాత్రి సీఆర్పీఎస్ సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారులు ఎదుట హరీష్ రావు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఏసిపి వెంకటగిరి ఈ నోటీసులను హరీష్ రావుకు అందించారు.

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్ జరిగిందని పదేపదే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చివరికి కేసీఆర్ కుమార్తె కూడా ఫోన్ టాపింగ్ జరిగిందని చెబుతున్నారు. తన భర్త ఫోన్ ను కూడా వదిలిపెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరించారని కవిత ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఫోన్ టాపింగ్ వ్యవహారంపై వేగంగా అడుగులు వేస్తోంది. ఫోన్ టాపింగ్ వల్ల గత ప్రభుత్వ పెద్దలు ఎలాంటి ప్రయోజనాలు పొందారు? నాటి ప్రభుత్వ పెద్దల కోసం పనిచేసిన వారు ఎలాంటి ఫలితాన్ని ఆశించారు? అనే విషయాలను బయట పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కృషి చేస్తుంది.

హరీష్ రావు కు సిట్ నోటీసు ఇవ్వడం సంచలనం కలిగించింది. ఈ కేసులో ముందుగా హరీష్ రావును, ఆ తర్వాత కేటీఆర్ ను, అనంతరం కేసీఆర్ ను విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. విచారణ అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే చాలామందిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. విచారణలో సేకరించిన సమాచారం తర్వాత హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. హరీష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని తెలుస్తోంది.

గతంలోనే తనకు నోటీసులు అందుతాయని హరీష్ రావు చెప్పారు.. పంచాయతీ ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని.. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తనకు కూడా ఇస్తారని హరీష్ రావు చెప్పారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే అది జరుగుతుందని హరీష్ రావు గతంలోనే వ్యాఖ్యానించారు.. ఇక ఈ వ్యవహారంలో ముందు నుంచి కూడా కేసీఆర్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఆయనను విచారిస్తారని.. దానికంటే ముందు నోటీసులు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper