Karimnagar: దేశంలో చిన్న పిల్లలు, బాలికల మిస్సింగ్ కేసులు ఏటా పెరుగుతున్నాయని క్రైం బ్యూరో ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మిస్సింగ్ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలని, మిస్ అయినవారిని త్వరగా పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లో 13 ఏళ్ల చిన్నారి రెండు రోజుల క్రితం మిస్ అయింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకన్న పోలీసులు ఐదు బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఏం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లాలో కలకలం చేపిన 13 ఏళ్ల బాలిక వశిష్ట రెండు రోజుల క్రితం నగరం శివారులోని బైపాస్లో అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలర్ట్ అయిన కరీంనగర్ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం ఐదుప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. నగరం అంతా జల్లెడ పట్టారు. చివరకు వశిష్ట ఆచూకీనిఇ హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో కనుగొన్నారు. అక్కడ వశిష్టను అక్కున చేర్చుకున్నారు. చిన్నారి భయంతో ఉండడంతో తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వశిష్ట అమ్మ కావాలని ఏడవడం మొదలు పెట్టింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం హైదరాబాద్ నుంచి కరీంనగర్కు తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వశిష్ట మిస్సింగ్ కథ సుఖాంతమైంది.
ఎందుకు హైదరాబాద్ వెళ్లింది..
అయితే కరీంనగర్ ౖ»ñ పాస్లో మిస్ అయిన వశిష్ట అసలు హైదరాబాద్కు ఎందుకు వెళ్లింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారా.. లేక తెలియకుండానే ఆమె బస్సు ఎక్కి వెళ్లిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మిస్ అయిన వశిష్ట రెండు రోజులు ఎక్కడ ఉంది అన్నది తెలియాల్సి ఉంది. రెండు రోజులు ఎలా గడిపింది అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వశిష్ట భయపడుతుండడంతో ఏమీ అడగలేకపోయారు. తర్వాత విచారణ చేపడతామని పేర్కొంటున్నారు. వశిష్ట కోసం రాత్రి పగలు నిర్వరామంగా గాలించి చిన్నారిని సేఫ్గా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులను ఆమె తల్లిదండ్రులు, స్థానికులు అభినందిస్తున్నారు.