Domakonda Fort : తెలంగాణలో అద్భుతమైన కోట.. 18వ శతాబ్దం నాటి దీని చరిత్ర తెలుసా?

తెలంగాణలో అనేక కోటలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు, శాతవాహనులు, చోళులు, చాళుక్యులు, చివరకు నిజాంలు అనేక కోటలు నిర్మించారు. ప్రతీ కోటకు ఒక చరిత్ర ఉంది.

Written By: Raj Shekar, Updated On : August 5, 2024 3:40 pm
Follow us on

Domakonda Fort : తెలంగాణ ప్రాంతాన్ని అనేక మంది పాలించారు. వారి పాలనకు గుర్తుగా ఆలయాలు, కోటలు నిర్మించుకున్నారు. పాలనా సౌలభ్యం కోసం రాజధానిలోనే కాకుండా తాము తరచూ వెళ్లే ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ కోటలు నిర్మించుకున్నారు. శాతవాహనులు, కాకతీయులు, చాళుక్యులు, చోళులు, నిజాంలు అనేక కోటలు నిర్మించారు. తమ రాజ్యాంన్ని రక్షించుకోవడానికి, సైన్యాన్ని ఉంచేందుకు ఇలాంటి కోటలు ఉపయోగపడ్డాయని చరిత్ర చెబుతుంది. ఇలాంటి కోటల్లో ఉమ్మడి నిజామాబాద్, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమకొండ కోట ఒకటి. ఇది 18 వ శతాబ్దంలో నిర్మించబడింది. కోట గోడ నిర్మాణానికి ఉపయోగించిన గ్రానైట్‌ శిలల కృత్రిమ సమ్మేళనం, అందమైన రెండు–అంతస్తుల కోట ప్రవేశ ద్వారం మీద చెక్క తలుపు తర్వాత, ఇది గొప్ప స్టూక్లోర్క్‌ కలిగి ఉంటుంది. ఈ కోటను ‘‘గడి దోమాకొండ’’ లేదా ‘‘కిల్ల దొమనొండ’’ అని కూడా పిలుస్తారు, ఇది ఒక పాలటి మహల్‌. లోపల ‘‘అద్దాలు మెడ ’’ (గ్లాస్‌ హౌస్‌) గా ప్రసిద్ధి చెందింది. అందమైన బంగళాలో ఒక నీటి తోట ఉద్యానవనం, గ్రానైట్‌ స్తంభాలతో అలంకరించబడిన ఒక ప్రాంగణం ఉంది. కింది అంతస్తులో మొఘల్‌ వాస్తుకళ ప్రభావం చూపించే క్లిష్టమైన స్టూక్వోవుర్‌తో వంపు స్తంభాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో పాశ్చాత్య వాస్తుకళను వర్ణించే ఒక ఫ్లాట్‌ సీలింగ్‌తోపాటు రౌండ్‌ స్తంభాలు ఉన్నాయి. ఈ కోట తెలంగాణ వారసత్వం యొక్క వైభవానికి సాక్ష్యంగా నిలుస్తుంది. దోమకొండ రాజ కుటుంబాలు ఇప్పటికీ ఈ కోటను పాలనా యంత్రాంగం నియంత్రిస్తాయి.

ప్రత్యేకతలు..
– 2022లో ఆసిమా – పసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ అవార్డును తెలంగాణ గత కాలపు ఘన కీర్తి బావుటాను ప్రపంచం ఎదుట సగర్వంగా ఎగురవేస్తోంది. దోమకొండ కోట.

– 18వ శతాబ్దంలో వనిర్మించిన ఈ కోటలో అనేక అద్భుత కట్టడారు ఉన్నాయి. మమ్మల్ని తలెత్తి చూడాల్సిందే అన్నంత ఠీవీగా చూస్తుంటాయి. దోమకొండ కోటర బురుజులు

– లోపలకు అడుగు పెడితే చరిత్ర పేజీలు కళ్ల ముందు తిరుగుతాయి. ప్రస్తుతం ఈ కోట తెలుగు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది.

– దోమకొండ కోట తెలంగాణలోని ప్రాచీన సంస్థానాల్లో ఒకటి. కాకతీయుల కాలంలో ఈ కోటలో మహదేవుని ఆలయానికి వచ్చి రాణిరుద్రమదేవి పూజలు చేశారు.

– కామినేని వంశస్తులు మరమ్మతులు చేపట్టిన తర్వాత వారి రాజఠీవీకి నిలువెత్తు నిదర్శనంగా మారింది. దోమకొండ కోట.

– ఆసియా – పసిఫిక్‌ కల్చరల్‌ కన్జర్వేషన్‌కు సంబంధించిన యునెస్కో అవార్డు రావడంతో దోమకొండ కోట మరింత పర్యాటక శోభ సంతరించుకుంది.

– దోమకొండ గ్రామంలో ఈ కోట పర్యటన కోసం కామినేని వంశస్తులు పర్యాటకులకు తగిన సహకారం అందిస్తున్నారు.

– దోమకొండ, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండ మండానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన కామారెడ్డికి 20 కి.మీ దూరంలో ఉంటుంది.

– పురాతన నిర్మాణం శివాలయ, లేదా మహాదేవ్‌ ఆలయం, ఇది కాకతీయుల కాలం నాటిది. కోటకు తూర్పున ఉంది. 750 నుంచి 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వ పురావస్తు శాఖ సహాయంతో 2006 లో పునరుద్ధరించారు. ఇది ప్రస్తుతం శివుడికి అంకితం చేయబడిన పూర్తిగా పనిచేసే ఆలయం. పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రతి సంవత్సరం దోమకొండ గ్రామ పౌరులు ఆలయం వద్ద శివరాత్రిని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.