హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి రూ. 10 వేలు :కేసీఆర్‌

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. లక్ష.. పాక్షికంగా దెబ్బతింటే రూ. 50 వేలు ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రజల కోసం తక్షణమే రూ.550 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిధులు మున్సిపల్‌ శాఖకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వరద నీటికి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేలు ఇస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, వారందరినీ […]

Written By: Suresh, Updated On : October 19, 2020 4:19 pm
Follow us on

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. లక్ష.. పాక్షికంగా దెబ్బతింటే రూ. 50 వేలు ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రజల కోసం తక్షణమే రూ.550 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిధులు మున్సిపల్‌ శాఖకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వరద నీటికి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేలు ఇస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.