హైదరాబాద్ లోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. వ్యవస్థలిపురంలోని సహారా ఎస్టేట్ రోడ్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.6.5 లక్షలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏటీఎం మిషన్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి మిషన్ లోని డబ్బులు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలిస్తున్నారు. నాలుగు టీమ్స్ ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.