హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్ సీసీ సజ్జనార్ ప్రకటించారు. పబ్ లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విస్త్రుతంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఉంటాయన్నారు. బ్రిటన్ లో ఇటీవల కొత్త రకం వైరస్ పెరుగుతోంది. అక్కడి నుంచి దేశంలోకి, అందులోనూ తెలంగాణలోకి చాలా మంది వచ్చారు. ఈ నేపథ్యంలో వైరస్ విస్తరించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం ప్రకటించాయి.