రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రాగన్నగూడకు చెందిన చంద్రకళ, అమె కుమారుడు ప్రదీప్ రెడ్డి ఇదే గ్రామంలోని నాగార్జున రహదారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తల్లీకుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిని కామినేని ఆసుపత్రికి […]

Written By: Suresh, Updated On : November 13, 2020 9:31 am
Follow us on

రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రాగన్నగూడకు చెందిన చంద్రకళ, అమె కుమారుడు ప్రదీప్ రెడ్డి ఇదే గ్రామంలోని నాగార్జున రహదారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తల్లీకుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేపింది.