పెళ్లి పీటలెక్కబోతున్న కెసిఆర్ దత్త పుత్రిక

సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుంది. తాను కోరుకున్న వ్యక్తితో పెళ్లి కాబోతున్నందుకు ప్రత్యూష సంతోషం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం ఆదివారం జరిగింది. 2017లో కనతల్లి, పినతల్లి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించింది ప్రత్యూష. అప్పట్లో ఈ సంఘటనకు స్పందించిన కేసీఆర్‌ ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించారు. తరువాత ఆమెను దత్తపుత్రికగా ప్రకటించారు. ఆమె సంరక్షణ బాధ్యతలనకు ఐఏఎస్‌ అధికారి రఘునందర్‌రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో […]

Written By: Suresh, Updated On : October 19, 2020 2:06 pm
Follow us on

సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుంది. తాను కోరుకున్న వ్యక్తితో పెళ్లి కాబోతున్నందుకు ప్రత్యూష సంతోషం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం ఆదివారం జరిగింది. 2017లో కనతల్లి, పినతల్లి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించింది ప్రత్యూష. అప్పట్లో ఈ సంఘటనకు స్పందించిన కేసీఆర్‌ ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించారు. తరువాత ఆమెను దత్తపుత్రికగా ప్రకటించారు. ఆమె సంరక్షణ బాధ్యతలనకు ఐఏఎస్‌ అధికారి రఘునందర్‌రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యూష యోగక్షేమాలను చూసుకుంటోంది. అప్పటి నుంచి చదువును పూర్తి చేసిన ప్రత్యూష ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మమత మర్రిరెడ్డిల కుమారుడు చరణ్‌రెడ్డి ఆమె పరిస్థితి విని ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్యూష కూడా అంగీకరించడంతో వీరి నిశ్చితార్థం నిన్న జరగింది.