అప్పుల తెలంగాణగా మారింది :కిషన్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలయిందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ప్రచారంలో శుక్రవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యమైందన్నారు. యువకుల ఆత్మబలిదానాలు, ఎన్నో పోరాటాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ సంక్షేమ పథకాల పేరిట అప్పులు చేస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నిక సమయంలోనే డబుల్‌బెడ్‌రూం ఇల్లను ప్రారంభించడం ఓట్ల కోసమేనన్నారు. అటు కేజీ బియ్యానికి కేంద్రం రూ. 30 ఇస్తే, సీఎం కేసీఆర్‌ రూ. 2 మాత్రమే ఇస్తున్నారని […]

Written By: Velishala Suresh, Updated On : October 30, 2020 2:13 pm

Kishan-Reddy

Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలయిందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ప్రచారంలో శుక్రవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యమైందన్నారు. యువకుల ఆత్మబలిదానాలు, ఎన్నో పోరాటాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ సంక్షేమ పథకాల పేరిట అప్పులు చేస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నిక సమయంలోనే డబుల్‌బెడ్‌రూం ఇల్లను ప్రారంభించడం ఓట్ల కోసమేనన్నారు. అటు కేజీ బియ్యానికి కేంద్రం రూ. 30 ఇస్తే, సీఎం కేసీఆర్‌ రూ. 2 మాత్రమే ఇస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.