
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో భారీగా పెరిగాయి. నిన్నటి వరకు 300 లోపు ఉన్న కరోనా కేసులు 400లకు పైగా పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 417 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,89,410గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,556గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,81,872 మంది కోలుకోగా ప్రస్తుతం 4,982యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,748మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఒక్కరోజే 43,318 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.