Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్నేడు 'ధరణి'పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

నేడు ‘ధరణి’పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

KCR

ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై అధికారులతో చర్చించనున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ సమావేశంలో సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular