
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన సోదరిపై వేధింపులకు గురిచేసిన వారిపై ఎందురు చర్యలు తీసుకోలేదని ఓ వ్యక్తి యూనివర్సిటీ స్పోర్ట్ డైరెక్టర్ను నిలదీశాడు. దీంతో నాన్బోర్డర్స్ ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తన సోదరితో కలిసి యూనివర్సిటీలో చుదువుతన్నారు.కొన్ని రోజుల కిందట నేషనల్ గేమ్స్లో పాల్గొన్న సమయంలో సదరు వ్యక్తి సోదరిపై కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆయన స్పోర్ట్స్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు. అయితే తన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని ఆ వ్యక్తి స్పోర్ట్స్ డైరెక్టర్ను గట్టిగా నిలదీశాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు వ్యక్తిపై దాడికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.