తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శీతాకాలం ఎక్కువవుతుండడంతో పాటు విదేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారితో కేసుల్లో పెరుగుల ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,82,982గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,522గా ఉన్నట్లు బులిటెన్‌లో […]

Written By: Velishala Suresh, Updated On : December 23, 2020 10:23 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శీతాకాలం ఎక్కువవుతుండడంతో పాటు విదేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారితో కేసుల్లో పెరుగుల ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,82,982గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,522గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,74,833 మంది కోలుకోగా ప్రస్తుతం 6,627యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 4,719 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 0.53 మరణాల శాతం ఉండగా, రికవరీ శాతం 95.7 శాతంగా ఉంది.