తెలంగాణలో కొత్తగా 592 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 592కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,81,414 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,513గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,73,013 మంది కోలుకోగా ప్రస్తుతం 6,888యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 4,719 మంది […]

Written By: Suresh, Updated On : December 20, 2020 10:11 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 592కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,81,414 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,513గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,73,013 మంది కోలుకోగా ప్రస్తుతం 6,888యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 4,719 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 41,970 కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.