https://oktelugu.com/

తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,84,391గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,529గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,76,244 మంది కోలుకోగా ప్రస్తుతం 6,618యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 4,535 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 24 […]

Written By: , Updated On : December 26, 2020 / 09:20 AM IST
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,84,391గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,529గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,76,244 మంది కోలుకోగా ప్రస్తుతం 6,618యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 4,535 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 24 గంటల్లో 30,376 పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు పరీక్షల సంఖ్య 66,86,363కి చేరింది.