Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSunita Williams: సునీత విలియమ్స్‌ రాక వాయిదా.. మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే భారత సంతతి వ్యోమగామి

Sunita Williams: సునీత విలియమ్స్‌ రాక వాయిదా.. మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే భారత సంతతి వ్యోమగామి

Sunita Williams: నాసా అంతరిక్ష వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయారు. వారం రోజుల పర్యటన కోసం బుచ్‌ విల్‌మోర్‌తో కలిసి సునీతా విలియమ్స్‌ బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే వారు ప్రాయణిస్తున్న నౌకలో హీలియం లీకేజీ ఉన్నట్లు గుర్తించారు. నాసా సూచనల మేరకు లీకేజీ అరికట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇద్దరూ ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. ఫిబ్రవరిలో తీసుకువస్తామని నాసా ప్రకటించింది. దీంతో మరో రెండు నెలల్లో సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ భూమికి తిరిగివస్తారని అంతా భావించారు. కానీ, తాజాగా వారి తిరిగి రాక మరింత ఆలస్యం అవుతుందని నాసా ప్రకటించింది.

మరో నెల రోజులు..
బోయింగ్‌ తయారు చేసిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు నాసా గుర్తించింది. ఈ కారణంగానే వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడానికి మరింత సమయం పడుతుందని భావిస్తున్నారు. 2025, మార్చి చివరి నాటికి వారిని స్పేస్‌ నుంచి భూమి మీదకు తీసుకువచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. జూన్‌ 6న బయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌క్యాప్సుల్‌లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. జూన్‌ 14న తిరిగి రవాల్సి ఉంది. కానీ, క్యాప్సుల్‌లో సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోయారు. స్టార్‌లైనర్‌ను భూమిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్‌ అయ్యాయి. సెప్టెంబర్‌లో స్పేస్‌ ఎక్స్‌ క్రూ మిషన్‌ను స్పేస్‌లోకి పంపింది. ఇందులో సునీత విలియమ్స్, విల్‌మోర్‌ భూమిపైకి వచ్చే ఏడాది రానున్నారు.

సునీత విలియమ్స్‌ యొక్క ముఖ్యమైన ప్రయాణాలు:

1. 2006 – అక్సిడెంట్‌: 2006లో, ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం (ఎస్‌టీఎస్‌–116) లో పాల్గొంది. ఈ ప్రయాణంలో ఆమె భారతీయ వంశానికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా గుర్తింపు పొందింది. ఆమె 6 నెలలు అంతరిక్షంలో గడిపి, అక్కడ అనేక పరిశోధనలపై పని చేసింది.

2. 2012 – రెండవ ప్రస్థానం: 2012లో ఆమె ఐఎస్‌ఎస్‌(ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌) లో పనిచేసింది, అదే సమయంలో ఎన్నో ప్రయోగాలు మరియు పరిశోధనలు జరిపి, భారతదేశంలో ఆమె ప్రతిష్టను మరింత పెంచింది.

సునీత విలియమ్స్‌ గురించి మరింత..
సునీత విలియమ్స్‌ 1965లో అమెరికాలో జన్మించారు. ఆమె నాసా యొక్క సీనియర్‌ వ్యోమగామి, మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, సన్మానాలు పొందినవారిలో ఆమె ఒకరు. ఆమె అఖిల భూమి గమనాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో, ఇకపై మరింత అంతరిక్ష ప్రయాణాలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version