Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీDead internet theory: మనిషిని డామినేట్‌ చేస్తున్న యంత్రం.. డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ నిజమవుతుందా?

Dead internet theory: మనిషిని డామినేట్‌ చేస్తున్న యంత్రం.. డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ నిజమవుతుందా?

Dead internet theory: ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్‌ అల్ట్‌మన్‌ తన ఎక్స్‌ (ఖాళీ ట్విటర్‌) ఖాతాలో చేసిన ఒక సాధారణ పోస్ట్‌ కలకలం రేపింది. ‘డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీని ఇంతకాలం నేను ఎక్కువగా నమ్మలేదు, కానీ కామ్‌ ట్రీ (ట్విటర్‌)ను చూస్తుంటే చాలా ఎల్‌ఎల్‌ఎం–రన్‌ ఖాతాలు ఉన్నట్టు అనిపిస్తోంది‘ అని ఆయన పోస్టు చేశాడు. చాట్‌జీపీటీ వంటి శక్తివంతమైన ఏఐ టూల్‌ను సృష్టించిన వ్యక్తి ఇలా చెప్పడం విస్మయాన్ని కలిగించింది. ఈ పోస్ట్‌ వైరల్‌ అవ్వడంతో […]

Dead internet theory: ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్‌ అల్ట్‌మన్‌ తన ఎక్స్‌ (ఖాళీ ట్విటర్‌) ఖాతాలో చేసిన ఒక సాధారణ పోస్ట్‌ కలకలం రేపింది. ‘డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీని ఇంతకాలం నేను ఎక్కువగా నమ్మలేదు, కానీ కామ్‌ ట్రీ (ట్విటర్‌)ను చూస్తుంటే చాలా ఎల్‌ఎల్‌ఎం–రన్‌ ఖాతాలు ఉన్నట్టు అనిపిస్తోంది‘ అని ఆయన పోస్టు చేశాడు. చాట్‌జీపీటీ వంటి శక్తివంతమైన ఏఐ టూల్‌ను సృష్టించిన వ్యక్తి ఇలా చెప్పడం విస్మయాన్ని కలిగించింది. ఈ పోస్ట్‌ వైరల్‌ అవ్వడంతో వినియోగదారులు స్పందించారు. ‘మీరే డెడ్‌ ఇంటర్నెట్‌కు పునాది వేశారు కదా?‘, ‘ఎలాన్‌ మస్క్‌ ప్రభావంతోనే ఇలా మాట్లాడుతున్నారా?‘ అని. కామెంట్స్‌ పెట్టారు. ఈ స్పందనలు థియరీకి మరింత దృష్టి ఆకర్షించాయి, ఏఐ సృష్టికర్తలు స్వయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే అనుమానాన్ని రేకెత్తించాయి.

ఇంటర్నెట్‌ యాంత్రిక మాయ..
2013–2016 మధ్య ‘డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ: మోస్ట్‌ ఆఫ్‌ ది ఇంటర్నెట్‌ ఇజ్‌ ఫేక్‌‘ అనే బ్లాగ్‌ ద్వారా ఈ సిద్ధాంతం ప్రజల్లోకి వచ్చింది. దీని మూల ఆలోచన: ఇంటర్నెట్‌లో ఎక్కువ భాగం నిజమైన మానవుల చర్యలు కాదు, బదులుగా ఏఐ బాట్లు, ఆటోమేటెడ్‌ స్క్రిప్ట్‌లు, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఆధారిత ఖాతాలు నడుపుతున్నాయి. సోషల్‌ మీడియాలో పోస్టులు, కామెంట్లు, లైకులు, షేర్లు – ఇవన్నీ మానవులు చేస్తున్నట్టు కనిపించినా, వాస్తవానికి యంత్రాలు సృష్టించినవి. 2016 తర్వాత నిజమైన యూజర్‌ యాక్టివిటీ తగ్గడం, బాట్లు పెరగడం ద్వారా ఇంటర్నెట్‌ ’మరణించింది’ అని ఈ థియరీ వాదిస్తుంది. మాట్రిక్స్‌ సినిమాలా, మానవులు యంత్రాలతో సంభాషిస్తున్న పరిస్థితి. అల్ట్‌మన్‌ వ్యాఖ్యలు ఈ ఆలోచనకు వాస్తవిక మద్దతును అందించినట్టు కనిపిస్తోంది, ఎందుకంటే ఎల్‌ఎల్‌ఎంలు (చాట్‌జీపీటీ లాంటివి) సోషల్‌ మీడియాను ఆక్రమించాయి.

విస్తరిస్తునన సోషల్‌ ఏఐ
ఈ సిద్ధాంతానికి ప్రాక్టికల్‌ ఎగ్జాంపుల్‌ సోషల్‌ఏఐ యాప్‌. టెక్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మైఖేల్‌ సైమన్‌ రూపొందించిన ఈ ప్లాట్‌ఫాం, యూజర్లు చాట్‌ చేస్తూ, పోస్టులు పెడతూ, కామెంట్లు చేస్తారు. కానీ ట్విస్ట్‌ ఏమిటంటే.. అన్ని ఇంటరాక్షన్లు నిజమైన మానవుల సృష్టి కాదు. ఏఐ బాట్లు మానవుల్లా స్పందిస్తాయి, లైకులు, కామెంట్లు కృత్రిమంగా జనరేట్‌ అవుతాయి. ఫలితంగా, యూజర్‌కు ఎవరు మానవుడో, బాట్‌గా గుర్తించడం కష్టం. ఇది డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీని రియల్‌–టైమ్‌లో చూపిస్తుంది, సోషల్‌ మీడియాలో రీచ్‌ పెంచడానికి ఏఐని ఎలా ఉపయోగిస్తారో వెల్లడిస్తుంది.

రీచ్‌ వెనుక రహస్యం..
సోషల్‌ మీడియాలో లైకులు, షేర్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. డెడ్‌ ఇంటర్నెట్‌ థియరీ ప్రకారం, 2016 తర్వాత నిజమైన యూజర్‌ యాక్టివిటీ తగ్గి, బాట్లు, ఏఐ ఆటోమేషన్‌ పెరిగాయి. ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను (ఎక్స్‌) కొనుగోలు చేసిన తర్వాత కంటెంట్‌ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే మోడల్‌ ప్రారంభమైంది. దీంతో ఏఐ బాట్లు, జనరేటెడ్‌ ఇమేజ్‌లు, పోస్టులు విస్తరించాయి. ఉదాహరణకు, చిన్న ఫాలోయింగ్‌ ఉన్న ఖాతా పోస్టుకు ఆకస్మికంగా వేలాది లైకులు వస్తే, అవి జెన్యూన్‌ కాకుండా బాట్‌–డ్రివెన్‌గా ఉండవచ్చు. ఇది ఆన్‌లైన్‌ అభిప్రాయాలు, అనుభవాలను కృత్రిమంగా ప్రభావితం చేస్తోంది, ఇష్టానుసారెంట్రీలు రీచ్‌ను మానవీయత నుంచి యాంత్రికత వైపు మళ్లిస్తున్నాయి.

క్షీణిస్తున్న మానవ మేధస్సు..
ఈ థియరీ మొదట కుట్రాంధంగా కనిపించినా, అల్ట్‌మన్‌ వ్యాఖ్యలు దానిని వాస్తవికంగా మలిచాయి. సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నట్లు, ఏఐ బాట్లపై ఆధారపడటం మానవ మేధస్సును క్షీణింపజేస్తుంది. స్కిల్స్‌ మరుగున పడిపోతాయి, మానవ సంబంధాలు అస్పష్టంగా మారతాయి. మానసిక స్థితిపై ప్రభావం పడవచ్చు, నిజ సమాచారాన్ని గుర్తించడం కష్టమవుతుంది. సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లు యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి, మానవులు తమను తాము మర్చిపోయే ప్రమాదం ఉంది. సృష్టికర్తలు స్వయంగా ఆందోళన చెందుతున్నారు, ఇది ఏఐ యుగంలో మానవత్వ గుర్తింపు సవాల్‌ను ఎత్తిచూపుతోంది.

ఏఐ బాట్లు, డీప్‌ఫేక్‌లు పెరిగిన సమయంలో నిజ మానవులను గుర్తించడానికి సామ్‌ అల్ట్‌మన్‌ 2019లో ప్రారంభించిన వరల్డ్‌కాయిన్‌ ప్రాజెక్టు కీలకం. 2023 జులైలో లాంచ్‌ అయిన ఈ ఇనిషియేటివ్, ఐరిస్‌ స్కానింగ్‌ ద్వారా ’ప్రూఫ్‌ ఆఫ్‌ పర్సన్‌హుడ్‌’ అనే యూనిక్‌ ఐడి ఇస్తుంది. బ్లాక్‌చైన్, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ ఉపయోగించి ఇంటర్నెట్‌ వినియోగాన్ని మానవులకు మాత్రమే పరిమితం చేస్తుంది. ప్రస్తుతం 1.2 కోట్ల మంది పాల్గొన్నారు, 25 లక్షల ఖాతాలు సృష్టించబడ్డాయి. ఇది డెడ్‌ ఇంటర్నెట్‌ సమస్యకు వినూత్న పరిష్కారం, కానీ ప్రైవసీ, డేటా సెక్యూరిటీ సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రాజెక్టు నత్తనడకల్లా ముందుకు సాగుతోంది, ఏఐ యుగంలో మానవ గుర్తింపును రక్షించే ఆశాకిరణంగా నిలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper