Homeబిజినెస్Job Market Crisis India: భారీగా ఉద్యోగాలున్నా.. కొలువులు మాత్రం ఇవ్వరట.. ఎలా బతకాలి సార్

Job Market Crisis India: భారీగా ఉద్యోగాలున్నా.. కొలువులు మాత్రం ఇవ్వరట.. ఎలా బతకాలి సార్

Job Market Crisis India: అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు ప్రతి దేశంలోనూ ప్రైవేట్ కంపెనీల కార్యకలాపాలే ఎక్కువ. పేరుకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగ ఉద్యోగాల కంటే.. ప్రైవేట్ రంగమే అధికంగా కొలువులను ఇస్తున్నది. ఇందులో ఐటీ రంగం అత్యధికంగా వేతనాలు ఇస్తుంది. ఆ తర్వాత ఫార్మా.. రియాల్టీ.. పర్చేజ్.. వేర్హౌస్.. ఇలా చెప్పుకోవాలంటే చాలా విభాగాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మన దేశంలో జాబ్ మార్కెట్ పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. దేశంలో 88% కంపెనీలు నియామకాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇందులో కొత్త వాళ్లకు ఉద్యోగాలు లభించడం లేదు. ముఖ్యంగా పలు కాలేజీలలో రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ.. చాలామంది విద్యార్థులకు అవకాశాలు ఏమాత్రం లభించడం లేదు. దీంతో బీటెక్లో ప్రతి పదిమందిలో ఎన్ని మంది.. ఎంబీఏలో ప్రతి నలుగురిలో ముగ్గురు.. ఇలా మొత్తం 84 శాతం మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగానే కనిపిస్తున్నారు. ఇదంతా కూడా అన్స్టాప్ టాలెంట్ రిపోర్టు 2026 నివేదికలో బయటపడింది. సాధారణంగా ఉద్యోగాలు లభించకపోతే ఆ దేశంలో కొలువుల వ్యవస్థ దారుణంగా ఉంటుంది అంటారు. కానీ మనదేశంలో జాబ్ మార్కెట్ మెరుగ్గా ఉన్నప్పటికీ ఉద్యోగాలు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మొన్నటి వరకు కొన్ని విభాగాలలో ఉద్యోగాలు లభించలేదు. అసలు వాటిలో కొత్తవారిని తీసుకోలేదు. ఇప్పుడు అవకాశం ఉన్నప్పటికీ కూడా కంపెనీలో ఫ్రెషర్లకు ఏమాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. అటు ఉద్యోగాలు లభించక.. ఇటు చదివిన చదువుకు సార్ధకత లేకపోవడంతో చాలామంది గ్రాడ్యుయేట్లు ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రభుత్వాలు సక్రమంగా ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో ఏం చేయాలో తెలియక నిరుద్యోగులు నరకం చేస్తున్నారు. వాస్తవానికి ప్రెషర్లకు ఉద్యోగాలు కంపెనీలు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు.. ప్రతి కంపెనీ కూడా అనుభవజ్ఞులు కావాలి అని చెబుతుంటే.. ప్రెషర్లకు ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి.. ఉద్యోగాలు ఇస్తేనే కదా ఫ్రెషర్లకు అనుభవం వచ్చేది. ఆ అనుభవంతోనే కదా వారు మెరుగ్గా పనిచేసేది. అవకాశం ఇవ్వకుండా అనుభవంతో పని చేయాలంటే ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని గ్రాడ్యుయేట్లు కంపెనీల నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటికే చాలావరకు కంపెనీలు మాన్ పవర్ మొత్తం తగ్గించాయి. కేవలం కొన్ని విభాగాలలో మాత్రమే మనుషులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ విభాగాలలో కూడా కంపెనీలు ప్రెషర్లకు అవకాశం ఇవ్వడం లేదు. దీనివల్ల గ్రాడ్యుయేట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధానాలను కంపెనీలు మార్చుకోవాలని.. ఉద్యోగుల విషయంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version