WTC Final 2023 India Vs Australia: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ విజేత ప్రైజ్ మనీ ఎంతంటే..?

భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Written By: BS, Updated On : June 7, 2023 8:20 am

WTC Final 2023 India Vs Australia

Follow us on

WTC Final 2023 India Vs Australia: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా..? అని ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓవల్ మైదానంలో ఈ ఫైనల్ పోరు జరగబోతోంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్ – ఆస్ట్రేలియా జట్టు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్న అభిమానులను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి అవేంటో..? వాటికి సమాధానాలు కూడా చదివేయండి.

టెస్ట్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీ ఏదైనా ఉందంటే అది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మాత్రమే. టెస్టులకు ఆదరణ పెంచే ఉద్దేశంతో ఐసీసీ రెండేళ్ల కిందట నుంచి ఈ టోర్నీ నిర్వహిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది టెస్టుల్లో ప్రపంచ కప్ లెక్క. మరుగున పడిపోతున్న టెస్ట్ క్రికెట్ కు తిరిగి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఐసిసి ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించింది. దీనికి పోటీపడిన జట్లలో పాయింట్లు పట్టికలో టాప్ లో నిలిచిన రెండు జట్లతో రెండేళ్లకు ఒకసారి ఫైనల్ నిర్వహిస్తోంది. 2021లో నిర్వహించిన తొలి ఫైనల్లో భారత్ – న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. తొలి ఫైనల్లో విజేతగా న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఈసారి తొమ్మిది జట్లు పోటీ పడగా ఆస్ట్రేలియా – భారత్ ఫైనల్ కు చేరుకున్నాయి. రెండో డబ్ల్యూటిసి ఫైనల్ ఎక్కడ జరగనుంది..? జట్ల వివరాలు, విజేతకు ఎంత మొత్తం ప్రైజ్ మనీ దక్కుతుంది.? వంటి వివరాలను తెలుసుకుందాం.

లండన్ లో జరగనున్న మ్యాచ్..

జూన్ 7వ తేదీ నుంచి 11 తేదీల మధ్య ఇంగ్లాండ్ లోని లండన్ నగరంలో గల ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 12 ను రిజర్వుడేగా ప్రకటించారు. వర్షం లేదా ఇతర ఇతర కారణాలవల్ల ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా ఆట నిర్వహణ సాధ్యం కాకపోతే రిజర్వు డే రోజు మ్యాచ్ కొనసాగిస్తారు.

ఈ మ్యాచ్ ను వీక్షించడం ఎలా..?

భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

విజేతకు అందించే ప్రైజ్ మనీ ఎంత అంటే..?

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో విజేతగా నిలిచి గదను దక్కించుకున్న జట్టుకు రూ.13 కోట్లు ప్రైజ్ మనీ దక్కుతుంది. రన్నరప్ నిలిచిన టీమ్ కు రూ.6.5 కోట్లు ఇస్తారు.

మ్యాచ్ ఆడే జట్ల వివరాలు..

భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), సుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, చటేశ్వర పుజారా, రవి చంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అజింక్యా రహానే, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్.

స్టాండ్ బై ఆటగాళ్లు :
యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్య కుమార్ యాదవ్

ఆస్ట్రేలియా జట్టు :

పాత్ కమిన్స్ (కెప్టన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ ( వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయాన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

స్టాండ్ బై ఆటగాళ్లు : మిచెల్ మార్ష్, మాట్ రెన్షా