Gautam Gambhir vs Bengaluru players: ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ లో భారత టి20 జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది. అయ్యర్ భారత జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. తిలక్ వర్మ ఉపసారధిగా ఎంపిక అయ్యాడు. ఇంకా కొంతమంది ప్లేయర్లు జట్టులో చోటు సంపాదించుకున్నారు. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ ఉద్వాసనకు గురయ్యారు. అయితే జట్టు ఎంపిక విషయంలో సానుకూల వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఒక విషయంలో మాత్రం గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గౌతమ్ గంభీర్ t20 జట్టులో రకరకాల మార్పులు తీసుకొచ్చారు. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేశామని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇంగ్లాండ్.. ఐర్లాండ్ సిరీస్లలో కొంతమంది ప్లేయర్లను ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. గౌతమ్ గంభీర్ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు అందరికీ చోటు లభించింది. కానీ బెంగళూరు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం లభించలేదు.
ఇటీవల ipl ట్రోఫీని బెంగళూరు జట్టుకు వరుసగా రెండవసారి అందించి కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడికి చోటు లభించలేదు. నిలకడగా ఆడిన దేవదత్ పడికల్ కు చోటు లభించలేదు. హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ.. ఇషాన్ కిషన్.. నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు సంపాదించుకున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ ఏకంగా వైస్ కెప్టెన్ హోదా పొందాడు. చెన్నై జట్టు ప్లేయర్లు సంజు శాంసన్, శివం దుబే చోటు సంపాదించుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్ కు అవకాశం దక్కుతుంది అనుకున్నప్పటికీ అతడికి చోటు లభించలేదు. సూర్య వంశీ రవి కి చోటు లభించింది. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి వరుణ్ చక్రవర్తి.. హర్షిత్ రానాకు అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్.. పంజాబ్ జట్టు నుంచి అర్ష్ దీప్ సింగ్, లక్నో జట్టు నుంచి ప్రిన్స్ యాదవ్.. గుజరాత్ పేట నుంచి సుందర్, సిరాజ్ కు చోటు లభించింది.
వాస్తవానికి పాటిదార్, పడికల్ నిలకడగా ఆడుతున్నారు. పైగా యంగ్ ప్లేయర్లు కూడా.. వీరికి అవకాశం ఇస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బలంగా నిలబడడం వీరిద్దరికి అలవాటు. వీరికి అవకాశం ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ గౌతమ్ గంభీర్ ఏకంగా ఆర్సిబి జట్టు మొత్తానికి షాకిచ్చాడు. అయితే ఇది కావాలని జరిగిందా.. యాదృచ్ఛికంగా చోటు చేసుకుందా.. భవిష్యత్తు కాలంలో వీరికి అవకాశాలు లభిస్తాయి.. అనే ప్రశ్నలు ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్నాయి. మరి వీటికి గౌతమ్ గంభీర్ తన చేతల ద్వారా ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.
