Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో 15 సంవత్సరాల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ ఎంతటి సంచలనాలను సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హేమా హేమీలైన ప్లేయర్లు ఆడినప్పటికీ సూర్య వంశీ మాత్రమే పరుగుల వరద పారించాడు. సీనియర్ ప్లేయర్లతో పోటీ మరీ సత్తా చూపించాడు. ఏకంగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.. అంతేకాదు అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్ లో కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి.. శ్రీలంక జట్టుకు ట్రోఫీని దూరం చేశాడు. తనను ఎగతాళి చేసిన శ్రీలంక ప్లేయర్లకు గట్టి సమాధానం చెప్పాడు. తద్వారా సూర్య వంశీ తనమీద అంచనాలను మరింత పెంచుకునే విధంగా చేశాడు.
టీమిండియా ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ వెళ్ళింది. అక్కడ ఆ జట్టుతో టి20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ టూర్ కు ఎంపికయ్యాడు వైభవ్ సూర్యవంశీ. ఇది అతడికి డెబ్యు సిరీస్. అతడు ఇటీవలే జట్టు ప్లేయర్లతో కలిసి ఐర్లాండ్ బయలుదేరి వెళ్లిపోయాడు. ఐపీఎల్ లో అదరగొట్టడం.. శ్రీలంక లో జరిగిన ట్రై సిరీస్లో దుమ్ము రేపడంతో సూర్య వంశీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అతడు ఐర్లాండ్ టూర్ లో అదరగొడతాడని అభిమానులు భావిస్తున్నారు.
సూర్య వంశీ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఐర్లాండ్ తో జరిగే సిరీస్ నేపథ్యంలో టికెట్లు భారీగా అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తం టికెట్లు అమ్ముడుపోవడం ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కల్పిస్తున్న వార్తల సారాంశం. దీనిపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. జాతీయ మీడియాలో గాని స్పోర్ట్స్ చానల్స్ లో గాని ఎటువంటి వార్తలు దీనికి సంబంధించి ప్రసారం కావడం లేదు. మరోవైపు ఐర్లాండ్ దేశంలో స్థిరపడిన భారతీయులు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మ్యాచ్ చూసేందుకు వారు భారీగానే వచ్చే అవకాశం ఉంది. టికెట్లు ఈ స్థాయిలో అమ్ముడుపోయాయంటే అందులో ఆశ్చర్యం కనిపించడం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు.. సూర్య వంశీ ఆడుతున్నప్పుడు మనదేశంలో మైదానాలు ప్రేక్షకులతో కిటకిటలాడాయి. అదే సన్నివేశం ఐర్లాండ్ లో కూడా చోటు చేసుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
