Homeక్రీడలుHardik Pandya: హార్దిక్ ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్.. కోహ్లీ ఏమన్నాడంటే..

Hardik Pandya: హార్దిక్ ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్.. కోహ్లీ ఏమన్నాడంటే..

Hardik Pandya: ఆటను ఆటలాగా చూడాలి.. ఓటమైనా, గెలుపైనా ఒకే విధంగా తీసుకోవాలి. అలాంటప్పుడే అసలు సిసలైన పోటీ తత్వం కనిపిస్తుంది. కానీ కొంతమంది అభిమానులు ఆటను ఆటలాగా చూడరు. ఆడే క్రీడాకారులను దైవాంశ సంభూతులుగా భావిస్తారు. ప్రత్యర్థి ఆటగాళ్లను విలన్లుగా పరిగణిస్తారు. అంతటితోనే వారు ఆగరు.. మైదానంలో మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను గేలి చేస్తారు. చిత్ర విచిత్రమైన విమర్శలతో ఇబ్బంది పెడుతుంటారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు.. దానివల్ల ఆ అభిమానులు పైశాచిక ఆనందాన్ని పొందుతారేమో కానీ.. చూసే ఆటగాళ్లకు మాత్రం వారి మీద ఒక రకమైన అసహ్యమైన భావం ఏర్పడుతుంది. గురువారం నాటి ముంబై, బెంగళూరు మ్యాచ్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది..

ఈ మ్యాచ్లో తొలుత బెంగళూరు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ముంబై జట్టు కేవలం 15.3 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.. వారి ధాటికి ముంబై స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే రన్ చేజింగ్ సమయంలో చివర్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ సమయంలో అభిమానులు అతడిని గేలి చేయడం మొదలుపెట్టారు. కొందరైతే ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం ప్రారంభించారు. దీంతో హార్దిక్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. అయితే మైదానంలో ఉండి ఈ పరిస్థితిని మొత్తం గమనిస్తున్న బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులను మందలించాడు. తన సంకేతాలతో వారిని అదుపులో ఉండాలని సూచించాడు..”అతడు ఇండియన్ ఆటగాడే కదా. మీరెందుకు అతడిని గేలి చేస్తున్నారు. అతడిని ఆడనివ్వండి.” అని కోహ్లీ అనగానే.. అభిమానులు ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత హార్దిక్.. హార్దిక్ అంటూ అరవడం మొదలుపెట్టారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. “ఒక సాటి ఆటగాడికి మరొక ఆటగాడు కచ్చితంగా అండగా ఉండాలి. ముఖ్యంగా ఉద్వేగాలు తారాస్థాయిలో ఉండే క్రికెట్లో అది మరింత ముఖ్యం. గురువారం నాటి మ్యాచ్లో కోహ్లీ దానిని నిరూపించాడు. అతడి ప్రవర్తన బాగుంది. అభిమానులు హద్దుల్లో ఉండాలి. ఆటను ఆటతీరుగా చూడాలి. వ్యక్తిగతంగా ఆటగాళ్లే తీసుకోనప్పుడు మధ్యలో అభిమానులకు వచ్చిన నష్టం ఏంటి” అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.. కాగా, హార్దిక్ పాండ్యా కు కోహ్లీ మద్దతుగా నిలిచిన తీరు పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అభిమానుల తీరు పట్ల నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper