Homeక్రీడలుక్రికెట్‌Foreign cricketer settles in India: భారతీయుడిగా ఆ లెజెండరీ క్రికెటర్.. ఇండియాలో స్థిరపడటమే తరువాయి..

Foreign cricketer settles in India: భారతీయుడిగా ఆ లెజెండరీ క్రికెటర్.. ఇండియాలో స్థిరపడటమే తరువాయి..

Foreign cricketer settles in India: నెత్తిమసిన స్టాలిన్ కొడుకు ఉదయనిధికి మన సనాతన ధర్మం గొప్పగా అనిపించకపోవచ్చు. అది కరోనా వైరస్ కంటే డేంజర్ లాగా అనిపించవచ్చు. అది అతడి స్థాయి. పైగా ఏమంటాడంటే సనాతన ధర్మం అనేది కుల వ్యవస్థను ఏర్పాటు చేసిందట. కుల వ్యవస్థను నిర్మూలించడమే ఆయన ధ్యేయమట. ఆ లెక్కన డిఎంకె ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుల వ్యవస్థను ఎందుకు నిర్మూలించలేదు.. కులాలవారీగా ఎందుకు మీటింగ్లు పెట్టాడు. మోస్ట్ వరస్ట్ పొలిటిషన్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ.

సరే ఆ సనాతన ద్రోహిని పక్కన పెడితే.. మన ధర్మాన్ని.. మన సిద్ధాంతాలను ఆచరించేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ఆమధ్య బీహార్ లోని గయా ప్రాంతానికి.. విదేశీయులు వచ్చారు. వారంతా తమ పూర్వికులకు పిండ ప్రదానాలు చేశారు. యుద్ధంలో చనిపోయిన తమ వారి ఆత్మ శాంతి కోసం ఇక్కడికి వచ్చామని.. ఇక్కడ సనాతన ధర్మం తమను ఎంతగానో ఆకట్టుకుందని వారు చెప్పారు. తమ త్వరలోనే హిందూ మతంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు వెల్లడించారు. వారు మాత్రమే కాదు.. ఇంకా చాలామంది విదేశీయులు మన ధర్మం పట్ల ఆకర్షితులై.. భారతీయులుగా మారిపోతున్నారు.

భారతీయతపై ఆసక్తి చూపిస్తున్న వారిలో పంజాబ్ జట్టు రికీ పాంటింగ్ కూడా ఒకరు. ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఈ పేరు అత్యంత సుపరిచితం. ఐపీఎల్ లో కూడా ఈయన ఆడారు. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది కుటుంబంతో కలిసి పూజలో పాల్గొన్నారు. నుదుటిమీద విభూది ధరించి కనిపించారు. ఈయడాది తన చేతికి దేవుడి దారం కట్టుకున్నారు. ఆధారాన్ని అత్యంత పరమ పవిత్రంగా పాంటింగ్ భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో పాంటింగ్ పూజలు చేసిన ఫోటోలు.. చేతికి దారం కట్టుకున్న ఫోటోలు విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాంటింగ్ మాట్లాడారు. తనకు భారతదేశం అంటే చాలా ఇష్టమని.. ఇక్కడి ప్రజలు అంటే అమితమైన ప్రేమ అని.. ఇక్కడ ధర్మం తనను ఎంతగానో ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకారం చూసుకుంటే త్వరలోనే అతడు ఆస్ట్రేలియాను పక్కనపెట్టి భారతదేశంలో స్థిరపడతాడని.. భారతీయుడుగా మారిపోతాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version