Homeక్రీడలుRavi Shastri: వన్డే క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందా.? రవి శాస్త్రి ఎందుకు అలా...

Ravi Shastri: వన్డే క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందా.? రవి శాస్త్రి ఎందుకు అలా అన్నారు..?

Ravi Shastri: వన్డే క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందా..? భవిష్యత్తులో ఈ ఫార్మాట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందా..? అంటే అవునన్న సమాధానమే క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి వస్తోంది. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఒకప్పుడు వన్డే క్రికెట్ అంటే అభిమానులు పిచ్చెక్కిపోయేవారు. రోజంతా మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించేవారు. వేలాదిగా వచ్చే అభిమానులతో స్టేడియాలు కిక్కిరిసి కనిపించేవి. గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్ కు ఆదరణ తగ్గుతోందన్న భావన క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. పొట్టి ఫార్మాట్ కు అలవాటు పడిన అభిమానులు రోజంతా మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ కోచ్ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. భవిష్యత్తులో వన్డే క్రికెట్ ప్రమాదంలో పడిపోబోతుందని ఆయన హెచ్చరించారు.

ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం కష్టమేనన్న రవి శాస్త్రి..

టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్ ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్ లు వస్తుండడంతో ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రాంచైజీలు ప్లేయర్స్ తో ఒప్పందం చేసుకుంటుండడంతో క్రికెట్ ఫుట్బాల్ బాటలో పయనిస్తుందని పేర్కొన్నారు. మున్ముందు ఇదే జరుగుతుందని స్పష్టం చేశారు. బీసీసీఐతో కాంట్రాక్టు లేని ఆటగాళ్ళు ఇతర దేశాల్లో జరిగే లీగుల్లో పాల్గొనే అవకాశం ఉందని రవిశాస్త్రి వివరించారు.

ఎంతోమంది నిపుణులది అదే మాట..

ఒక్క రవి శాస్త్రి మాత్రమే కాకుండా క్రికెట్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని గత కొన్నాళ్లుగా వ్యక్తం చేస్తున్నారు. పొట్టి ఫార్మాట్ చూసేందుకు అలవాటు పడిన అభిమానులు ఒక రోజు మొత్తం జరిగే వన్డే క్రికెట్ ను చూసేందుకు ఇష్టపడడం లేదని పేర్కొంటున్నారు. దీనివల్ల వన్డే క్రికెట్ చూసే అభిమానుల సంఖ్య తగ్గిపోతుంది అని, వీక్షకులు లేనప్పుడు వన్డే క్రికెట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఐసీసీకి ఏర్పడుతుందని పలువురు చెబుతున్నారు. తాజాగా రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలను పలువురు మాజీ క్రికెటర్లు కూడా సమర్థిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో ఐపీఎల్ తరహా లీగ్ లు పుట్టుకు వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని పురుడు పోసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లీగ్ లు ఖచ్చితంగా వన్డే ఫార్మాట్ పై ప్రభావం చూపుతాయన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. లీగ్ ల్లో ఆడితే భారీగా ఆదాయం వస్తుండడంతో.. చాలా మంది క్రికెటర్లు దేశానికి ఆడడం కంటే.. లీగుల్లో ఆడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version