India Vs Ireland: టీమ్ ఇండియా లాంటి అత్యంత బలమైన జట్టు మీద సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. అందులోనూ టి20 ఫార్మాట్లో గెలవడం అంత సులభం కాదు. కానీ దీనిని చేసి చూపించింది ఐర్లాండ్ జట్టు. ఏకంగా రెండు టీ20 మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధించి ట్రోఫీ అందుకుంది. దక్షిణాఫ్రికా నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు ఏ జట్టు వల్ల కానిది ఐర్లాండ్ జట్టు చేసి చూపించింది.
ఐర్లాండ్ జట్టు ఈ విజయం సాధించిన తర్వాత.. టీమిండియా మీద విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కెప్టెన్ అయ్యర్ వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.”అవకాశం రాకపోతే సో కాల్డ్ ఆర్మీ ద్వారా విమర్శలు చేయిస్తారు. అవకాశం వచ్చిన తర్వాత ఇలా చేతులెత్తేస్తారు. ఇటువంటి ఆటగాళ్లను నమ్ముకుని జట్టు పగ్గాలు అప్పగిస్తే.. నిండా ముంచేస్తారు. అసలు ఇటువంటి వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడతారు.
. క్రికెట్లోకి ఎందుకు వస్తారు.. మేనేజ్మెంట్ కు బుర్ర లేదు. ముందుచూపు అంతకంటే లేదని” నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐర్లాండ్ జట్టు చారిత్రాత్మకమైన విజయం సాధించిన తర్వాత.. టీమిండియా మీద ట్రోఫీని అందుకున్న తర్వాత.. వాస్తవానికి ఆ జట్టు ప్లేయర్లు ఆకాశం చివరి అంచులో తేలిపోతున్నారు. ప్రపంచాన్ని జయించినంత గొప్పగా వేడుకలు చేసుకుంటున్నారు. కానీ ఐర్లాండ్ జట్టు కోచ్ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారత జట్టు మీద గెలిచిన తర్వాత అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని సగటు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఐర్లాండ్ జట్టు కోచ్ గా హెన్రిచ్ మలాన్ కొనసాగుతున్నారు. 2022లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. 2027 వరకు ఆయనకు పదవీకాలం ఉంది. అయితే ఇంకా ఒక సంవత్సరం ఆయనకు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ.. తన కోచ్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేయాల్సి ఉందని.. దాని కంటే ముందుగానే తాను జట్టు నుంచి వెళ్ళిపోతున్నానని ఆయన పేర్కొన్నారు. కొత్త కోచ్ గా గ్యారీ విల్సన్ నియమితులవుతారని తెలుస్తోంది. ఐర్లాండ్ జట్టు ఈ స్థాయిలో విజయం సాధించినప్పటికీ కోచ్ పదవి నుంచి తప్పుకోవడం పట్ల మలాన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
