India vs Afghanistan ODI: 2027 వన్డే వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా టీమిండియా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వైట్ బాల్ ఫార్మాట్లో మరింత శక్తివంతంగా తయారు కావాలని భావిస్తుంది. ప్రస్తుతం టీమిండియా సొంత దేశంలో ఆఫ్గనిస్తాన్ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు ఈ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో.. దీనిని సన్నాహకంగా మార్చుకోవాలని టీమ్ ఇండియా బలంగా నిర్ణయించుకుంది. అందువల్లే మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో.. వన్డే సిరీస్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
ధర్మశాల వేదికగా శనివారం ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మీద అందరి దృష్టి ఉంది. కొద్దిరోజులుగా అతడు తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. చికిత్స తీసుకున్నాడు. మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. గాయం వల్ల ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లలో రోహిత్ సరిగా ఆడలేదు. కొన్ని మ్యాచ్ల్లో ఇంపాక్ట్ ఆటగాడిగానే బరిలోకి దిగాడు.
సామర్థ్య పరీక్షలను అతడు విజయవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ సిరీస్ కు అతడు అందుబాటులోకి వచ్చేసాడు. అయితే ప్రాక్టీస్ సమయంలో శర్మ తన తొడ భాగానికి అదనపు రక్షణ ప్యాడ్ ధరించాడు. దీంతో అతడి సామర్థ్యం మీద మరోసారి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గాయం తగ్గిందా? అనే ప్రశ్నలు మీడియా లో వినిపిస్తున్నాయి.
రోహిత్ సామర్థ్యం మీద బౌలింగ్ కోచ్ మోర్కల్ క్లారిటీ ఇచ్చాడు.. అతడి సామర్థ్యం మీద ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అతడు పూర్తిస్థాయిలో ఆడతాడు అని చెప్పాడు. అంతేకాదు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వేగంగా బంతులు వస్తాయి కాబట్టి.. ఆటగాళ్లు ఆమాత్రం రక్షణ తీసుకుంటారని చెప్పాడు.
డ్రెస్సింగ్ రూమ్ లో ప్రణాళికల గురించి చర్చిస్తామని.. అప్పుడప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని మోర్కెల్ పేర్కొన్నాడు. పైగా రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉండడం ఎంతో బలాన్ని ఇస్తుందని అతడు స్పష్టం చేశాడు. మోర్కల్ డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయట పెట్టడంతో సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ సాధించేవరకు మోర్కల్ తన నోటికి తాళం వెయ్యాలని సూచిస్తున్నారు. మేనేజ్మెంట్ ఈ విషయం మీద దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

