Homeక్రీడలుక్రికెట్‌IND Vs SA World Cup Final: 2005, 2017 లో ఫైనల్ కు.. రెండుసార్లు...

IND Vs SA World Cup Final: 2005, 2017 లో ఫైనల్ కు.. రెండుసార్లు టీం ఇండియా ఎందుకు విజేత కాలేకపోయిందంటే?

IND Vs SA World Cup Final: మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ దాకా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. కాకపోతే ఈసారి జట్టు గతంలో ఎన్నడు లేనంతగా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ఓడించి ఫైనల్ దాకా వెళ్ళింది. 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేసి అదరగొట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై కూడా ఇదే స్థాయిలో ఆడాలని.. తొలిసారి ట్రోఫీ అని సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. పైగా ఆదివారం సెలవు రోజు కావడం.. ఆరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అందరు కూడా టీవీలు, ఫోన్ లకు అతుక్కుపోవడం ఖాయమని తెలుస్తోంది.

2005 లో మిథాలీ రాజు నేతృత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే ఆస్ట్రేలియా జట్టు దూకుడు ముందు టీమ్ ఇండియా నిలబడలేకపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆ టార్గెట్ ఫినిష్ చేయడంలో టీమ్ ఇండియా విఫలమైంది. భారత జట్టు తరుపున అంజూ జైన్ చేసిన 29 పరుగులు టాప్ స్కోర్ అంటే భారత బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెట్ మిథాలీ రాజ్ 6 పరుగులకే అవుట్ అయింది. ఈ నేపథ్యంలో నాటి మ్యాచ్లో భారత జట్టు 46 ఓవర్ల పాటు ఆడినప్పటికీ 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

2017లో భారత మహిళల జట్టు అద్భుతంగా ఆడింది.. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఫైనల్ దాకా వెళ్ళింది. వెంట్రుక వాసి తేడాలో ట్రోఫీని కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టుపై పోరాడి ఓడిపోయింది. నాటి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సివర్ 51, సారా 45 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. భారత జట్టులో గోస్వామి మూడు, పూనం యాదవ్ రెండు వికెట్లతో అదరగొట్టారు. 229 రన్స్ టార్గెట్ ఫినిష్ చేయడంలో టీమిండియా ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించింది. ఈ నేపథ్యంలో 219 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ పూనమ్ యాదవ్ 86, హర్మన్ ప్రీత్ కౌర్ 51, వేద కృష్ణమూర్తి 35 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. స్మృతి సున్నా పరుగులకు అవుట్ కావడం.. మిథాలీ 17 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ చివరి దశలో తలవంచాల్సి వచ్చింది. నాకు ఇంగ్లాండ్ బోర్డర్ అన్య ష్రబ్సోల్ 6/46 అద్భుతంగా ప్రదర్శన చేయడంతో భారత జట్టు ఓడిపోవలసి వచ్చింది.

గత రెండుసార్లతో పోల్చి చూస్తే ఈసారి టీం మీడియా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ప్లేయర్లు అదరగొడుతున్నారు. స్పిన్ బౌలర్లు సత్తా చూపిస్తున్నారు. బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపిస్తే టీమ్ ఇండియాకు అడ్డనేది ఉండదు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version