spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Aus 4th Test: పెర్త్ లో వాళ్లు 201 రన్స్ కొట్టినా.. నితీష్...

Ind Vs Aus 4th Test: పెర్త్ లో వాళ్లు 201 రన్స్ కొట్టినా.. నితీష్ , సుందర్ భాగస్వామ్యమే అత్యుత్తమం..

Ind Vs Aus 4th Test: పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో రెండవ ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (161), రాహుల్ (77) తొలి వికెట్ కు 201 పరుగులు నమోదు చేశారు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి వికెట్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా కొనసాగుతోంది. అయితే వీరిద్దరూ నెలకొల్పిన ఆ భాగస్వామ్యం వల్ల టీమిండియా ఆస్ట్రేలియాపై ఏకంగా 295 రన్స్ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆ మ్యాజిక్ ను రాహుల్, యశస్వి జైస్వాల్ జోడి రిపీట్ చేయలేకపోయింది. ఫలితంగా టీమిండియా విజయాలపై అది ప్రభావం చూపించింది. అయితే మళ్లీ ఇన్ని రోజులకు టీమిండియా ఆ స్థాయిలో ఆడింది. అలా ఆడింది ఏ రోహితో, విరాట్ కోహ్లీనో, రాహులో, జైస్వాలో కాదు.

అదరగొట్టారు

మెల్ బోర్న్ టెస్టులో వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయినప్పటికీ.. జట్టుకు ఎంతో ఉపయోగమైన పరుగులు చేశాడు. తనదైన డిఫెన్స్ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి తోడ్పాటు అందిస్తూ.. జట్టును ఫాలో ఆన్ ఆడకుండా తన వంతు ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయినప్పటికీ.. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఎనిమిదో వికెట్ కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వాస్తవానికి నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఈ స్థాయిలో ఆడతారని ఎవరూ ఊహించలేదు. నితీష్ మీద అందరికీ అంచనాలు ఉన్నప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ మీద ఎవరికీ ఎటువంటి అభిప్రాయం లేదు. దీంతో టీం ఇండియా త్వరగానే ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మార్ష్, స్టార్క్, కమిన్స్, లయన్, బోలాండ్, హెడ్ వంటి బౌలర్ల బౌలింగ్లో ఎదుర్కొంటూ టీమిండియా కు గౌరవప్రద స్థానాన్ని అందించారు. వాస్తవానికి పెర్త్ టెస్టులో రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు రాహుల్, జైస్వాల్ మీద పెద్దగా ఒత్తిడి లేదు. ఎందుకంటే అప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా పై కొంత లీడ్ లో ఉంది. కానీ మెల్బోర్న్ మ్యాచ్లో అందుకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అప్పటికే 7 వికెట్లు పోయాయి. ఫాలో ఆన్ ప్రమాదం కళ్ళ ముందు ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఆడుతూ.. ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకుంటూ.. నిదానంగా పరుగులు చేసుకుంటూ.. ఇటుక ఇటుక పేర్చినట్టు బ్యాటింగ్ చేస్తూ.. ఆస్ట్రేలియాకు చేయాల్సిన నష్టం చేశారు నితీష్, సుందర్. ఒకవేళ సుందర్ కనుక అవుట్ అయ్యి ఉండకుండా ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదేమో.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper