Hardik Pandya: ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఊహించని దెబ్బ కొట్టాడు. దీంతో ఇప్పుడు అతడి కెరియర్ ప్రమాదంలో పడింది.. హార్దిక్ పాండ్యా తదుపరి ఏం చేస్తాడు అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. ఇటీవల అతడు ముంబై ఇండియన్స్ జట్టులో కనిపించడం లేదు. వరుస ఓటములతో గ్రూప్ దశ నుంచే ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు యాజమాన్యం గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఇటీవల బీసీసీఐ పెద్దలను కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఆయా జట్ల ఆటగాళ్లు తమ స్నేహితురాళ్ళతో కలసి హోటల్ గదులలో ఉంటున్నారని.. అందువల్ల ఆట మీద ఏకగ్రాత చూపించడం లేదని.. దీనివల్ల ఓటములు ఎదురవుతున్నాయని ఆకాష్ బీసీసీఐ పెద్దలతో చెప్పినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా తన స్నేహితురాలితో కలిసి తిరగడం వల్ల ఆట మీద మనసు లగ్నం చేయలేకపోయాడని.. దానివల్ల తన జట్టు గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ పెద్దలు కఠిన నిబంధనలను విధించినట్టు సమాచారం. హోటల్ గదుల్లోకి స్నేహితురాళ్ళను తీసుకెళ్లకుండా షరతులు విధించినట్టు సమాచారం. పంజాబ్ జట్టులో అర్ష్ దీప్ సింగ్, హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ ఇలాగే స్నేహితురాళ్ళ తో కలిసి హోటల్ గదిలోకి వస్తున్నారు. వారితో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇది క్రమశిక్షణ లోపించేలా చేస్తోందని.. దీనివల్ల ఐపిఎల్ నియమావళి సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉందని బిసిసిఐ పెద్దలు చెబుతున్నారు. అందువల్లే ఆటగాళ్లు నిబంధనలు పాటించాలని పేర్కొంటున్నారు.
తన స్నేహితురాలిని హార్దిక్ పాండ్యా తీసుకెళ్లకుండా షరతులు విధించడంతో అతడు ఇబ్బంది పడుతున్నాడు. పైగా ముంబై నాయకుడిగా అతడు విఫలం కావడంతో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. వాస్తవంగా గాయమైందని అతడిని ఆడించలేదని ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం వేరే. ఆకాష్ వల్ల హార్దిక్ స్నేహితురాలితో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయింది.. మరోవైపు హార్దిక్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో.. వచ్చే సీజన్లో అతడిని ముంబై జట్టు సారధిగా కొనసాగించే అవకాశం లేదని క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.