spot_img
Homeక్రీడలుGautam Gambhir- MS Dhoni: అంతా ధోనినే చేయలేదా? వరల్డ్ కప్ గెలవడం వెనుక సంచలన...

Gautam Gambhir- MS Dhoni: అంతా ధోనినే చేయలేదా? వరల్డ్ కప్ గెలవడం వెనుక సంచలన నిజాలు వెలుగులోకి!

Gautam Gambhir- MS Dhoni: టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఐపీఎల్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో గొడవ పడ్డాడు. తాజాగా మాజీ కెప్టెన్, ఐపీఎల్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేద్రసింగ్‌ ధోనీని టార్గెట్‌ చేశాడు. మిస్టర్‌ కూల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాజాగా గంభీర్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

సమిష్టిగా రాణించాం..
రాజకీయాలను తలపించేలా క్రికెట్‌లోనూ రాజకీయాలు వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తానొక్కడినే తెలంగాణ సాధించానని చెప్పుకుంటారు. కానీ సబ్బండవర్గాలు ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. కానీ క్రెడిట్‌ మొత్తం కేసీఆర్‌ కొట్టేశారు. చివరకు తెలంగాణ ఇచ్చిన పార్టీకి కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే తరహాలో గంభీర్‌ టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌.ధోనీపై వ్యాఖ్యలు చేశారు. 2007, 2011 ప్రపంచకప్‌లలో జట్టు సమష్టిగా రాణించడం వల్ల భారత్‌ విజేతగా నిలిచిందన్నారు. కానీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని మాత్రమే హీరోను చేసేశారని ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ విమర్శించాడు. ప్రచార బృందం గట్టిగా పని చేయడం వల్లే ధోనికి ఆ పేరు వచ్చిందని అన్నాడు.

తాజాగ పొగడ్తల నేపథ్యంలో..
ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్‌ నుంచి తప్పుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఇంకొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ధోనీని తెరపైకి తెచ్చారు. ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం ధోనీకే సాధ్యం అవుతుంది అని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ స్పందించాడు.

సమష్టి వైఫల్యమే..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి సమిష్టి వైఫల్యమే కారణమని గంభీర్‌ అభిప్రాయపడ్డారడు. ‘ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ వరుస వైఫల్యాలకు కారణం మనం వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం జట్టు ప్రదర్శనకు ఇవ్వకపోవడమే. ఇతర క్రికెట్‌ జట్లు సమష్టి ప్రదర్శనకు పెద్దపీట వేస్తాయి. భారత్‌ జట్టు సభ్యులు మాత్రం వ్యక్తిగత ఆటపైనే దృష్టిపెట్టారు’ అని విమర్శించాడు. ‘2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచిందంటే నాటు ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగే ప్రధాన కారణం. ఈ రెండు టోర్నీల్లోనూ యువీనే జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ పీఆర్‌ ఏజెన్సీ బృందాలు ధోనీని హీరోని చేసేశాయి’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

గంభీర్‌ వ్యాఖ్యలపై మండిపాటు..
మిస్టర్‌ కూల్‌ ధోనీపై గంభీర్‌ చేసిన వ్యాఖ్యలను ధోనీ ఫ్యాన్స్‌ ఖండిస్తున్నారు. కావాలని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం సరికాదని పేర్కొంటున్నారు. గంభీర్‌ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవల కోహ్లీతోనూ కావాలనే గొడవ పడ్డాడని అంటున్నారు. పద్దతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Oktelugu Epaper
Exit mobile version