spot_img
Homeక్రీడలుRCB Vs RR: అహ్మదాబాద్ లో నలుగురి అరెస్ట్.. ఆర్సీబీ ప్రాక్టీస్ రద్దు.. కోహ్లీకి కట్టుదిట్టమైన...

RCB Vs RR: అహ్మదాబాద్ లో నలుగురి అరెస్ట్.. ఆర్సీబీ ప్రాక్టీస్ రద్దు.. కోహ్లీకి కట్టుదిట్టమైన సెక్యూరిటీ..

RCB Vs RR: మరికొద్ది గంటల్లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.. ఇప్పటికే మైదానంలోకి ప్రేక్షకులకు పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక షాక్ కు గురి చేసే వార్త మీడియాలో ప్రసారమవుతోంది. ” అహ్మదాబాదులో ఉగ్ర అనుమానితులను అరెస్టు చేశారు. బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీకి భద్రతను పెంచారు. బెంగళూరు జట్టు తమ సాధనను కూడా నిలిపివేసింది. మరోవైపు అహ్మదాబాద్ విమానాశ్రయంలో భద్రతను పెంచారని ” మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఉగ్ర అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా.. ఉగ్రవాదులు తాము ఇన్ని రోజులుగా ఉన్న రహస్య నివాసాన్ని, ఆయుధాలు, అనుమానాస్పద వీడియోలను బయటపెట్టారు.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పరిణామాలు మంగళవారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో బెంగళూరు జట్టు ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసింది. విలేకరుల సమావేశాన్ని క్యాన్సిల్ చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేడియం వద్ద భారీగా భద్రతను పెంచారు. బెంగళూరు ఆటగాళ్లు బస చేసిన హోటల్ వద్ద సెక్యూరిటీని టైట్ చేశారు. రాజస్థాన్ జట్టు ఆటగాళ్లు ఉన్న హోటల్లోనూ నిఘా ను పటిష్టం చేశారు. దీంతో రాజస్థాన్ జట్టు కూడా తన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసింది. పోలీసులు రక్షణ కల్పించడంతో రాజస్థాన్ జట్టు ప్రాక్టీస్ చేసుకోవడం మొదలుపెట్టింది.

ఇక విరాట్ కోహ్లీ కి భద్రతను పోలీసులు భారీగా పెంచారు. “బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీని జాతీయ సంపదగా భావిస్తోంది. అందువల్ల ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలని అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆయనని ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనద్దని సూచించాం. మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవాలని విన్నవించామని” ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్ నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది లేదని.. రాత్రి 7:30 కు ప్రారంభమవుతుందని ఐపీఎల్ నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయర్ -2 కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుతో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ పోరులో కోల్ కతా జట్టును చెన్నై వేదికగానే ఢీకొంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper