Australia T20 World Cup 2026: 2023లో టీమ్ ఇండియా మీద వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. టీమిండియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడం అప్పట్లో సంచలనం కలిగించింది…
టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు వరల్డ్ కప్ మీద కాలు పెట్టి ఫోటో లు దిగారు. అప్పట్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్పట్లో కొంతమంది ఆస్ట్రేలియా ప్లేయర్లు వ్యవహరించిన తీరును తీవ్రంగా విమర్శించారు…
2023లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో విజయం సాధించింది. ఆ తర్వాత ఐసీసీ నిర్వహించిన ఏ మేజర్ టోర్నీలో కూడా విజేతగా నిలవలేకపోయింది.
2024 t20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. భారత్ చేతుల్లో కూడా ఓటమిపాలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమ్ ఇండియా చేతిలో ఓటమిపాలైంది. ఇది మాత్రమే కాదు పాకిస్తాన్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, టీమిండియా చేతుల్లో వన్డే సిరీస్ లు కోల్పోయింది ఆస్ట్రేలియా.
గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. టి20 వరల్డ్ కప్ లో ప్రస్తుతం జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా ఒకప్పుడు క్రికెట్ మొత్తాన్ని శాసించింది. ఐసీసీ నిర్వహించిన ప్రతి టోర్నీ లోను సత్తా చూపించింది. ఆస్ట్రేలియా దూకుడు ముందు అన్ని జట్లు తలవంచేవి.
గతం ఎంతో ఘనం అన్నట్టుగా ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితి మారిపోయింది. చిన్న చిన్న జట్ల చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాడు వన్డే వరల్డ్ కప్ మీద కాళ్లు పెట్టి ఆస్ట్రేలియా ప్లేయర్లు ఫోటోలు దిగడం వల్లే ఇంతటి దుస్థితి దాపురించిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా తల పొగరు తగ్గించుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. “ఒకప్పుడు ప్రత్యర్థి ప్లేయర్లను దూషించేవారు. ఆ తర్వాత తల పొగరు ను ఒంట పట్టించుకున్నారు. ఇప్పుడేమో తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఆస్ట్రేలియాకు ఇప్పుడు వాస్తవంలో కనిపిస్తోందని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.