Sharmila: షర్మిల తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ దీక్షలు చేస్తున్నారు. ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు. జిల్లాల పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టివచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను బీ-టీం కాదని ఎన్నో సందర్భాల్లోనూ చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇటీవల ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును జగన్, అతని అనుచరగణం వ్యక్తిగత దూషణలకు దిగినా షర్మిల స్పందించడం లేదు. చంద్రబాబు భార్యను అవమానకరంగా మాట్లాడితే ఓ మహిళ అయి ఉండి కూడా ఎందుకు స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడానికి ఆయన సతీమణిని దారుణంగా అవమానించిన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రతి స్పందనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచి కూడా పలువురు నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ సహా అనేక మంది వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు. మహిళల్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ కొండా సురేఖ కూడా స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరి కావన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడానికి ఓ కారణం ఉంది. కొద్ది రోజుల కిందట టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్న ఓ ఉత్తరాది ఊతపదాన్ని పట్టుకుని.. సీఎం జగన్ తననే అన్నారని తెలుగులో కొత్త అర్థం చెప్పుకున్నారు. అలా చెప్పుకుని చేసిన దాడులను కేటీఆర్ సమర్థించారు. ఓ ముఖ్యమంత్రిని అలా తిట్టడం ఏమిటన్నారు. దానికి సాక్షి మీడియా భారీగా ప్రచారం కల్పించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానంపై.. మహిళల్ని కించ పరిచిన వైనంపై ఎందుకు స్పందించరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రశ్నలో రీజన్ ఉంది. అలాగే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎందుకు స్పందించని కొండా సురేఖ ప్రశ్నించారు. స్వయంగా తన అన్న నేత త్వం వహిస్తున్న పార్టీ.. తాను ఓటు వేయాలని ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు ఓ మహిళను ఘోరంగా అవమానిస్తే ఎందుకు మాట్లాడరని శర్మిలను ప్రశ్నించారు. ఆమె స్పందించాలని సురేఖ డిమాండ్ చేస్తున్నారు. ఆమె స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
Also Read: Visakha Capital Issue: విశాఖ రాజధాని ఫైట్: జగన్ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో ఉద్యమం షురూ..
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More