ముంబై దాడుల్లో పట్టుబడ్డ కసాబ్.. ఒక హిందువా..?

ముంబై మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా తన కొత్త పుస్తకం “లెట్ మీ సే ఇట్ నౌ”లో కసబ్ ని గూర్చి ఒక ఆసక్తిరక విషయాన్ని పేర్కొన్నారు. ముంబై 26/11 దాడుల కేసులో ప్రధాన సూత్రధారి మరియు పట్టుబడ్డ లష్కర్-ఎ-తైబా కి చెందిన కసాబ్ బెంగళూరు కు చెందిన సమీర్ చౌదరిగా మరణించేవాడని అదే అతని ప్లాన్ అని అన్నారు. ఒకవేళ 26/11 దాడులు ప్రణాళిక ప్రకారం జరిగి ఉంటే, కసాబ్, చౌదరి వలె చనిపోయేవాడని” […]

Written By: Neelambaram, Updated On : February 18, 2020 7:13 pm
Follow us on

ముంబై మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా తన కొత్త పుస్తకం “లెట్ మీ సే ఇట్ నౌ”లో కసబ్ ని గూర్చి ఒక ఆసక్తిరక విషయాన్ని పేర్కొన్నారు. ముంబై 26/11 దాడుల కేసులో ప్రధాన సూత్రధారి మరియు పట్టుబడ్డ లష్కర్-ఎ-తైబా కి చెందిన కసాబ్ బెంగళూరు కు చెందిన సమీర్ చౌదరిగా మరణించేవాడని అదే అతని ప్లాన్ అని అన్నారు.

ఒకవేళ 26/11 దాడులు ప్రణాళిక ప్రకారం జరిగి ఉంటే, కసాబ్, చౌదరి వలె చనిపోయేవాడని” అదే అతని ప్లాన్ అని మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా తెలపడం ఆసక్తికరంగా ఉంది. అదే జరిగి ఉన్నట్లయితే హిందూ ఉగ్రవాదులు ముంబైపై ఎలా దాడి చేశారని తాటికాయంత అక్షరాలతో వార్తాపత్రికలలో రాసేవారని, పెద్ద పెద్ద టీవీ జర్నలిస్టులు తన కుటుంబం మరియు పొరుగువారిని ఇంటర్వ్యూ చేయడానికి బెంగళూరుకు ఒక బీలైన్ తయారుచేసేవారు. కానీ అది ఆ విధంగా జరగలేదు మరియు అతను పాకిస్తాన్లోని ఫరీద్కోట్ కు చెందిన అజ్మల్ అమీర్ కసాబ్ ”అని మరియా తన పుస్తకంలో రాశారు.

అయితే కసాబ్ హిందువా..? అనే అనుమానం రావడానికి కారణం.. తన కుడి చేయి మణికట్టు మీద ఎరుపు రంగు దారం ధరించి ఉన్నట్లు గుర్తించారు – అది పవిత్రమైన హిందూ దారం అని నమ్ముతారు. 26/11 దాడులను “హిందూ టెర్రర్” గా నిందించడానికి నేరస్తులు యోచిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ముంబై దాడులు ముమ్మాటికీ “హిందూ టెర్రర్” కాదని అనేమంది హిందువులు వాదిస్తున్నారు.